అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనం పట్టివేత!
అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనం పట్టివేత!
K.RAVI
10 పశువుల స్వాధీనం, వాహనం సీజ్, డ్రైవర్ అరెస్ట్
అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాన్ని చౌటుప్పల్ పోలీసులు పంతంగి టోల్ప్లాజా వద్ద పట్టుకున్నారు. ఎస్హెచ్ఓ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ కె. రాంబాబు, కానిస్టేబుల్ సీతారాం రెడ్డిలు పెట్రో మొబైల్-1 వాహనంలో విధుల్లో ఉండగా అందిన సమాచారం మేరకు టోల్ప్లాజా వద్ద తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీల్లో అశోక్ లేలాండ్ (TS 29 TA 4895) వాహనాన్ని తనిఖీ చేయగా, అందులో అక్రమంగా తరలిస్తున్న 5 ఆవులు, 5 ఎద్దులు (మొత్తం 10 పశువులు) లభ్యమయ్యాయి. డ్రైవర్ను విచారించగా అతని పేరు ఎస్కే కరీముల్లా బాబా (22), స్వస్థలం సూర్యాపేట జిల్లా నడిగూడెం అని తెలిపాడు. కోదాడ సంతలో పశువులను కొనుగోలు చేసి హైదరాబాద్కు తరలిస్తున్నట్లు నిందితుడు అంగీకరించాడు.ఈ మేరకు పశువులను, వాహనాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ వెల్లడించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి