PRINT TIME: July 10, 2026 08:54 PM
మల్లయ్య యాదవ్ ఆరోపణలు నిరాధారం: కాంగ్రెస్ నాయకులు
మల్లయ్య యాదవ్ ఆరోపణలు నిరాధారం: కాంగ్రెస్ నాయకులు
July 10, 2026 05:26 PM
19 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish K
కోదాడ నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి వేగంగా జరుగుతుండటాన్ని చూసి మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు రావెళ్ల కృష్ణారావు, మైలారి శెట్టి భాస్కర్ విమర్శించారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని, ఆరోపణలకు ఆధారాలు ఉంటే ప్రజల ముందుంచాలని సవాల్ విసిరారు. కోదాడలో రోడ్లు, తాగునీరు, గ్రామీణాభివృద్ధి, సంక్షేమ పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిపై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకుని కోదాడ ప్రజలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి