Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 08:54 PM

పాడి గేదె మృతితో రైతు లింగస్వామికి తీరని నష్టం

పాడి గేదె మృతితో రైతు లింగస్వామికి తీరని నష్టం

పాడి గేదె మృతితో రైతు లింగస్వామికి తీరని నష్టం
July 10, 2026 11:09 AM 124 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల, జూలై 10: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామానికి చెందిన రైతు నాలుగోని లింగస్వామికి చెందిన పాడి గేదె గురువారం విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందడంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కుటుంబానికి ఆదాయ వనరుగా ఉన్న గేదె ఒక్కసారిగా మృతి చెందడంతో రైతు ఆర్థికంగా దెబ్బతిన్నాడు.

స్థానికుల వివరాల ప్రకారం, మేత కోసం వెళ్లిన గేదె ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రవహిస్తున్న తీగలను తాకడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందింది. విషయం తెలుసుకున్న రైతు లింగస్వామి సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యాడు. పాడి పరిశ్రమపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న తనకు ఈ ఘటనతో తీవ్ర నష్టం వాటిల్లిందని వాపోయాడు.

గ్రామస్తులు ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ బాధిత రైతుకు ప్రభుత్వం, సంబంధిత శాఖల అధికారులు తక్షణమే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News