పాడి గేదె మృతితో రైతు లింగస్వామికి తీరని నష్టం
పాడి గేదె మృతితో రైతు లింగస్వామికి తీరని నష్టం
Komidala Mahender reddy
చిట్యాల, జూలై 10: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామానికి చెందిన రైతు నాలుగోని లింగస్వామికి చెందిన పాడి గేదె గురువారం విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందడంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కుటుంబానికి ఆదాయ వనరుగా ఉన్న గేదె ఒక్కసారిగా మృతి చెందడంతో రైతు ఆర్థికంగా దెబ్బతిన్నాడు.
స్థానికుల వివరాల ప్రకారం, మేత కోసం వెళ్లిన గేదె ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రవహిస్తున్న తీగలను తాకడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందింది. విషయం తెలుసుకున్న రైతు లింగస్వామి సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యాడు. పాడి పరిశ్రమపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న తనకు ఈ ఘటనతో తీవ్ర నష్టం వాటిల్లిందని వాపోయాడు.
గ్రామస్తులు ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ బాధిత రైతుకు ప్రభుత్వం, సంబంధిత శాఖల అధికారులు తక్షణమే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి