99 రోజుల ప్రజా పాలనలో భాగంగా కోదాడ డిపో లో ఆరోగ్య అవగాహన సదస్సు
99 రోజుల ప్రజా పాలనలో భాగంగా కోదాడ డిపో లో ఆరోగ్య అవగాహన సదస్సు
Harish HS
99 రోజుల ప్రజా పాలనలో భాగంగా కోదాడ డిపో లో ఆరోగ్య అవగాహన సదస్సు
99 రోజుల ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా TGSRTC ఆధ్వర్యంలో తార్నాక హాస్పిటల్కు చెందిన డా. గౌరీ మేడం గారు కోదాడ డిపోలో ఆరోగ్య అవగాహన సదస్సును నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డిపోకు చెందిన డ్రైవర్లు, కండక్టర్లు మరియు గ్యారేజ్ సిబ్బంది పాల్గొన్నారు. డా. గౌరీ గారు ఉద్యోగులు తమ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, రోజువారీ జీవితంలో పాటించాల్సిన ఆరోగ్య నియమాలు, ఆహారపు అలవాట్లు, వ్యాయామం ప్రాముఖ్యత వంటి అంశాలపై విపులంగా వివరించారు.ప్రత్యేకంగా డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజ్ సిబ్బంది,ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం వల్ల వచ్చే సమస్యలు, ఒత్తిడి నిర్వహణ, నిద్రలేమి, షుగర్, బీపీ వంటి వ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు. అలాగే సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరమని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ మరియు AMF స్టేషన్ మేనేజర్,సూపర్ వైజర్స్ మరియు సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి