PRINT TIME: April 10, 2026 12:11 AM
8వ వార్డులో అభివృద్ధి నా లక్ష్యం : కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ వహీద్ మహమ్మద్
8వ వార్డులో అభివృద్ధి నా లక్ష్యం : కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ వహీద్ మహమ్మద్
December 12, 2025 07:36 PM
270 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రతినిధి కొండ మల్లేష్ గౌడ్
యాదాద్రి–భువనగిరి జిల్లా రామన్నపేట మండలం 8వ వార్డు మెంబర్ పదవికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అబ్దుల్ వహీద్ మహమ్మద్, గౌను గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే వార్డు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.
కరోనా మహమ్మారి సమయంలో తాను చేసిన సేవలను గుర్తుచేసిన ఆయన, ఆ సమయంలో ప్రజల పక్కన నిలబడి అనేక విధాలుగా సహాయం చేసిన విషయాన్ని పేర్కొన్నారు.
“వార్డు ప్రజలు నాకు ఒక్క అవకాశం ఇస్తే, సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా చూసుకుంటాను. రోడ్లు, డ్రెయినేజ్, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధిని ప్రాధాన్యతగా తీసుకుంటాను” అని అబ్దుల్ వహీద్ మహమ్మద్ అన్నారు.
కరోనా టైం లో చేసిన సేవ
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి