Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
8 కుక్కల దాడిలో బాలుడు తీవ్రగాయాలు. హస్తినాపురంలో ఘటన.. కామినేనిలో చికిత్స పుట్టపర్తికి సీఎం రాక.ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ బుక్కపట్నం గ్రామంలో దక్షిణాన నల్లకొండపై 14 వ శతబ్ద ఆలయం కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 12, 2026 02:07 AM

8 కుక్కల దాడిలో బాలుడు తీవ్రగాయాలు. హస్తినాపురంలో ఘటన.. కామినేనిలో చికిత్స

8 కుక్కల దాడిలో బాలుడు తీవ్రగాయాలు. హస్తినాపురంలో ఘటన.. కామినేనిలో చికిత్స

8 కుక్కల దాడిలో బాలుడు తీవ్రగాయాలు. హస్తినాపురంలో ఘటన.. కామినేనిలో చికిత్స
May 12, 2026 12:40 AM 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

హైదరాబాద్‌: హస్తినాపురం డివిజన్‌ పరిధిలోని టీచర్స్‌ ఫేజ్‌–2 కాలనీలో వీధికుక్కలు చిన్నారిపై దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. సిద్దిపేట నుంచి వేసవి సెలవుల కోసం పిన్ని ఇంటికి వచ్చిన అద్విక్‌ అనే బాలుడిపై ఒక్కసారిగా సుమారు 8 కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

మంగళవారం రాత్రి 7.30 నుంచి 8 గంటల సమయంలో ఇంటి సెల్లార్‌ ప్రాంతంలో అద్విక్‌ ఆడుకుంటుండగా ఈ దారుణం చోటుచేసుకుంది. బాలుడి అరుపులు విన్న కుటుంబ సభ్యులు వెంటనే అతడిని రక్షించి కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఘటన విషయం తెలుసుకున్న హస్తినాపురం డివిజన్‌ తాజా మాజీ కార్పొరేటర్‌ మొద్దు లచ్చిరెడ్డి, మన్సూరాబాద్‌ మాజీ కార్పొరేటర్‌ కొప్పుల నరసింహారెడ్డి, లింగోజిగూడ మాజీ కార్పొరేటర్‌ ధర్పల్లి రాజశేఖర్‌రెడ్డి ఆసుపత్రికి చేరుకుని బాలుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరడంతో పాటు సంబంధిత అధికారులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నగరంలో వీధికుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బాలుడి చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరించాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News