Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా వ్యాపారవేత్త గోదల వెంకటరెడ్డి జన్మదిన వేడుక 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 09:25 PM

8 కుక్కల దాడిలో బాలుడు తీవ్రగాయాలు. హస్తినాపురంలో ఘటన.. కామినేనిలో చికిత్స

8 కుక్కల దాడిలో బాలుడు తీవ్రగాయాలు. హస్తినాపురంలో ఘటన.. కామినేనిలో చికిత్స

8 కుక్కల దాడిలో బాలుడు తీవ్రగాయాలు. హస్తినాపురంలో ఘటన.. కామినేనిలో చికిత్స
May 12, 2026 12:40 AM 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

హైదరాబాద్‌: హస్తినాపురం డివిజన్‌ పరిధిలోని టీచర్స్‌ ఫేజ్‌–2 కాలనీలో వీధికుక్కలు చిన్నారిపై దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. సిద్దిపేట నుంచి వేసవి సెలవుల కోసం పిన్ని ఇంటికి వచ్చిన అద్విక్‌ అనే బాలుడిపై ఒక్కసారిగా సుమారు 8 కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

మంగళవారం రాత్రి 7.30 నుంచి 8 గంటల సమయంలో ఇంటి సెల్లార్‌ ప్రాంతంలో అద్విక్‌ ఆడుకుంటుండగా ఈ దారుణం చోటుచేసుకుంది. బాలుడి అరుపులు విన్న కుటుంబ సభ్యులు వెంటనే అతడిని రక్షించి కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఘటన విషయం తెలుసుకున్న హస్తినాపురం డివిజన్‌ తాజా మాజీ కార్పొరేటర్‌ మొద్దు లచ్చిరెడ్డి, మన్సూరాబాద్‌ మాజీ కార్పొరేటర్‌ కొప్పుల నరసింహారెడ్డి, లింగోజిగూడ మాజీ కార్పొరేటర్‌ ధర్పల్లి రాజశేఖర్‌రెడ్డి ఆసుపత్రికి చేరుకుని బాలుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరడంతో పాటు సంబంధిత అధికారులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నగరంలో వీధికుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బాలుడి చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరించాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News