7వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతా
7వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతా
K.RAVI
7వ వార్డు అభ్యర్థి కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి
చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏడవ వార్డు అభ్యర్థి కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి సుందరయ్య కాలనీలో ఇంటింటికి తిరిగి మహిళలకు బొట్టు పెట్టి ఓటు అభ్యర్థించారు. కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తనను గెలిపిస్తే స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ఏడో వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఇంటింటికి ప్రతిరోజు కృష్ణ వాటర్ ఇస్తామని, మురుగునీరు వెళ్ళుటకు అన్ని బజార్లలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మిస్తామని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యలను తమ సమస్యలుగా భావించి నాయకురాలుగా కాకుండా మీకు సేవకురాలుగా ఉంటానని అన్నారు. ఈ ప్రచారంలో దుబ్బాక శ్రీనివాస్ రెడ్డి, ఆకాష్ రెడ్డి, ఐలయ్య, అశోక్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి కాలనీ మహిళలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి