Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:05 AM

700 సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూమిని పేద కుటుంబాల ఇండ్ల స్థలాలకు కేటాయించాలి

700 సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూమిని పేద కుటుంబాల ఇండ్ల స్థలాలకు కేటాయించాలి

700 సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూమిని పేద కుటుంబాల ఇండ్ల స్థలాలకు కేటాయించాలి
January 07, 2026 06:01 PM 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ

స్థానికం:యదాద్రి భువనగిరి జిల్లా బుర్యో జి.శ్రీనివాస్

భువనగిరి పట్టణ శివారులోని 700 సర్వే నెంబర్ లోని ప్రభుత్వ భూమిని చదును చేసి ప్లాట్లు చేసి పేద ప్రజలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలను ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ అన్నారు. బుధవారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఇండ్లు లేని పేద ప్రజలతో కలిసి బంజారాహిల్స్ నుండి స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా జరిగిందని తెలిపారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ…ఇటీవల సిపిఎం పట్టణ కమిటీ పోరాట ఫలితంగా 700 సర్వే నెంబర్లులో అధికారులు వచ్చి సర్వే నిర్వహించి 20 ఎకరాలు సీలింగ్ భూమిగా, 18 ఎకరాలు పట్టాగా మొత్తం 38 ఎకరాలు ఉన్నదని తెలియజేశారని అన్నారు. భూమిని చదును చేసి ప్లాట్లు చేసి పేద ప్రజలకు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందనిన్నారు. ఇండ్లు,ఇండ్ల స్థలాలు లేక కిరాయిలు కట్టలేక పేద ప్రజలు ఇక్కట్లు పడుతున్నారన్నారు. కిరాయి ఇంట్లో ఉంటూ ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఇల్లు లేకపోతే ఆ బాధ వర్ణాతితం అనిన్నారు. గత 20 సంవత్సరాలుగా పోరాటాల నిర్వహిస్తున్న పట్టా కాగితాలకే పరిమితమయ్యారు తప్ప ఇండ్లు,ఇండ్ల స్థలాలు కేటాయించలేదని అన్నారు. ప్రజా పాలన అంటున్న ఈ ప్రభుత్వం కనీసం ప్రజల బాధలను అర్థం చేసుకునే పరిస్థితి లేదన్నారు. 700 సర్వే నెంబర్లలో ఉన్న ప్రభుత్వ భూమిని చదును చేసి ప్లాట్లు చేసి పట్టణంలోని పేద ప్రజలకు ఇండ్లు,ఇండ్ల స్థలాలను ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గుడిసేవాసుల భూపోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ,పట్టణ కార్యదర్శ వర్గ సభ్యులు బందెల ఎల్లయ్య, వనం రాజు,సిపిఎం పట్టణ నాయకులు దండగిరి,కోటగిరి వీరబ్రహ్మం,కొత్త లక్ష్మయ్య,నరాల నరసింహ,పల్లెర్ల గంగయ్య,గుడిసేవాసుల కమిటీ సభ్యులు దొడ్డి శంకర్,నారి కలమ్మ, అరుణ,స్రవంతి,మౌనిక,మంజుల,స్వామి,యాదగిరి,హేమలత,అంజయ్య తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News