Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:33 PM

700 సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూమిని పేద కుటుంబాల ఇండ్ల స్థలాలకు కేటాయించాలి

700 సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూమిని పేద కుటుంబాల ఇండ్ల స్థలాలకు కేటాయించాలి

700 సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూమిని పేద కుటుంబాల ఇండ్ల స్థలాలకు కేటాయించాలి
07-01-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ

స్థానికం:యదాద్రి భువనగిరి జిల్లా బుర్యో జి.శ్రీనివాస్

భువనగిరి పట్టణ శివారులోని 700 సర్వే నెంబర్ లోని ప్రభుత్వ భూమిని చదును చేసి ప్లాట్లు చేసి పేద ప్రజలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలను ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ అన్నారు. బుధవారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఇండ్లు లేని పేద ప్రజలతో కలిసి బంజారాహిల్స్ నుండి స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా జరిగిందని తెలిపారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ…ఇటీవల సిపిఎం పట్టణ కమిటీ పోరాట ఫలితంగా 700 సర్వే నెంబర్లులో అధికారులు వచ్చి సర్వే నిర్వహించి 20 ఎకరాలు సీలింగ్ భూమిగా, 18 ఎకరాలు పట్టాగా మొత్తం 38 ఎకరాలు ఉన్నదని తెలియజేశారని అన్నారు. భూమిని చదును చేసి ప్లాట్లు చేసి పేద ప్రజలకు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందనిన్నారు. ఇండ్లు,ఇండ్ల స్థలాలు లేక కిరాయిలు కట్టలేక పేద ప్రజలు ఇక్కట్లు పడుతున్నారన్నారు. కిరాయి ఇంట్లో ఉంటూ ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఇల్లు లేకపోతే ఆ బాధ వర్ణాతితం అనిన్నారు. గత 20 సంవత్సరాలుగా పోరాటాల నిర్వహిస్తున్న పట్టా కాగితాలకే పరిమితమయ్యారు తప్ప ఇండ్లు,ఇండ్ల స్థలాలు కేటాయించలేదని అన్నారు. ప్రజా పాలన అంటున్న ఈ ప్రభుత్వం కనీసం ప్రజల బాధలను అర్థం చేసుకునే పరిస్థితి లేదన్నారు. 700 సర్వే నెంబర్లలో ఉన్న ప్రభుత్వ భూమిని చదును చేసి ప్లాట్లు చేసి పట్టణంలోని పేద ప్రజలకు ఇండ్లు,ఇండ్ల స్థలాలను ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గుడిసేవాసుల భూపోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ,పట్టణ కార్యదర్శ వర్గ సభ్యులు బందెల ఎల్లయ్య, వనం రాజు,సిపిఎం పట్టణ నాయకులు దండగిరి,కోటగిరి వీరబ్రహ్మం,కొత్త లక్ష్మయ్య,నరాల నరసింహ,పల్లెర్ల గంగయ్య,గుడిసేవాసుల కమిటీ సభ్యులు దొడ్డి శంకర్,నారి కలమ్మ, అరుణ,స్రవంతి,మౌనిక,మంజుల,స్వామి,యాదగిరి,హేమలత,అంజయ్య తదితరులు పాల్గొన్నారు.


Sthanikam

700 సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూమిని పేద కుటుంబాల ఇండ్ల స్థలాలకు కేటాయించాలి

Article Image

సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ

స్థానికం:యదాద్రి భువనగిరి జిల్లా బుర్యో జి.శ్రీనివాస్

భువనగిరి పట్టణ శివారులోని 700 సర్వే నెంబర్ లోని ప్రభుత్వ భూమిని చదును చేసి ప్లాట్లు చేసి పేద ప్రజలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలను ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ అన్నారు. బుధవారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఇండ్లు లేని పేద ప్రజలతో కలిసి బంజారాహిల్స్ నుండి స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా జరిగిందని తెలిపారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ…ఇటీవల సిపిఎం పట్టణ కమిటీ పోరాట ఫలితంగా 700 సర్వే నెంబర్లులో అధికారులు వచ్చి సర్వే నిర్వహించి 20 ఎకరాలు సీలింగ్ భూమిగా, 18 ఎకరాలు పట్టాగా మొత్తం 38 ఎకరాలు ఉన్నదని తెలియజేశారని అన్నారు. భూమిని చదును చేసి ప్లాట్లు చేసి పేద ప్రజలకు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందనిన్నారు. ఇండ్లు,ఇండ్ల స్థలాలు లేక కిరాయిలు కట్టలేక పేద ప్రజలు ఇక్కట్లు పడుతున్నారన్నారు. కిరాయి ఇంట్లో ఉంటూ ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఇల్లు లేకపోతే ఆ బాధ వర్ణాతితం అనిన్నారు. గత 20 సంవత్సరాలుగా పోరాటాల నిర్వహిస్తున్న పట్టా కాగితాలకే పరిమితమయ్యారు తప్ప ఇండ్లు,ఇండ్ల స్థలాలు కేటాయించలేదని అన్నారు. ప్రజా పాలన అంటున్న ఈ ప్రభుత్వం కనీసం ప్రజల బాధలను అర్థం చేసుకునే పరిస్థితి లేదన్నారు. 700 సర్వే నెంబర్లలో ఉన్న ప్రభుత్వ భూమిని చదును చేసి ప్లాట్లు చేసి పట్టణంలోని పేద ప్రజలకు ఇండ్లు,ఇండ్ల స్థలాలను ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గుడిసేవాసుల భూపోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ,పట్టణ కార్యదర్శ వర్గ సభ్యులు బందెల ఎల్లయ్య, వనం రాజు,సిపిఎం పట్టణ నాయకులు దండగిరి,కోటగిరి వీరబ్రహ్మం,కొత్త లక్ష్మయ్య,నరాల నరసింహ,పల్లెర్ల గంగయ్య,గుడిసేవాసుల కమిటీ సభ్యులు దొడ్డి శంకర్,నారి కలమ్మ, అరుణ,స్రవంతి,మౌనిక,మంజుల,స్వామి,యాదగిరి,హేమలత,అంజయ్య తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News