Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 02:51 PM

50 ఏళ్ల తర్వాత కలిసిన 1975-76 పదో తరగతి పూర్వ విద్యార్థులు

50 ఏళ్ల తర్వాత కలిసిన 1975-76 పదో తరగతి పూర్వ విద్యార్థులు

50 ఏళ్ల తర్వాత కలిసిన 1975-76 పదో తరగతి పూర్వ విద్యార్థులు
February 23, 2026 06:02 AM 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Hyderabad
Alpha Raw

ఆర్మూర్లో జ్ఞాపకాల హారంతో గోల్డెన్ జూబ్లీ

ఆర్మూర్ పట్టణంలో అరుదైన ఆత్మీయ క్షణాలు ఆవిష్కృతమయ్యాయి. జిల్లా పరిషత్ హైయర్ సెకండరీ స్కూల్ (బాలుర)లో 1975-76 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఐదు దశాబ్దాల అనంతరం ఒకే వేదికపై కలుసుకుని జ్ఞాపకాల హారాన్ని అలంకరించుకున్నారు.

పట్టణంలోని క్షత్రియ మినీ ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన గోల్డెన్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహభరితంగా సాగింది. అరవై దశాబ్దాల క్రితం తరగతి గదుల్లో పంచుకున్న మధుర స్మృతులు మరోసారి సజీవమయ్యాయి. ఆ రోజుల్లోని క్రమశిక్షణ, గురువుల పట్ల గౌరవభావం, హైయర్ సెకండరీ విద్యకు ఉన్న విలువ వంటి అంశాలు చర్చల్లో ప్రధానంగా నిలిచాయి.

తమ తమ కుటుంబాల వివరాలు, ఉద్యోగ జీవితం, పదవీ విరమణ అనంతర కార్యకలాపాలను పరస్పరం పంచుకుంటూ స్నేహబంధాన్ని మరింత బలపరిచారు. కష్టసుఖాలను గుర్తుచేసుకుంటూ సహపంక్తి భోజనం చేసి ఆనందంగా గడిపారు.

ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు శంకరయ్య, సుధాకర్, మార్కండేయ, రవీంద్ర మోహన్‌లను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. “శేషజీవితాన్ని సమాజ సేవకు అంకితం చేస్తాం” అంటూ పూర్వ విద్యార్థులు సంకల్పం వ్యక్తం చేశారు.

ఈ సమ్మేళనంలో సుదర్శన్, రమేష్ బదామి, కర్తన్ కిషన్, మధుసూదన్, జి. మోహన్, ఆనంద్ కుమార్ గుప్తా, జెస్సు వినయ్, ఎం. రాజేశ్వర్, లక్ష్మణ్, ఎస్. మోహన్, డి. గంగాధర్, కే. సూర్యప్రకాశ్, పి. జయప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News