Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:07 AM

50 ఏళ్ల తర్వాత కలిసిన 1975-76 పదో తరగతి పూర్వ విద్యార్థులు

50 ఏళ్ల తర్వాత కలిసిన 1975-76 పదో తరగతి పూర్వ విద్యార్థులు

50 ఏళ్ల తర్వాత కలిసిన 1975-76 పదో తరగతి పూర్వ విద్యార్థులు
February 23, 2026 06:02 AM 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Hyderabad
Alpha Raw

ఆర్మూర్లో జ్ఞాపకాల హారంతో గోల్డెన్ జూబ్లీ

ఆర్మూర్ పట్టణంలో అరుదైన ఆత్మీయ క్షణాలు ఆవిష్కృతమయ్యాయి. జిల్లా పరిషత్ హైయర్ సెకండరీ స్కూల్ (బాలుర)లో 1975-76 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఐదు దశాబ్దాల అనంతరం ఒకే వేదికపై కలుసుకుని జ్ఞాపకాల హారాన్ని అలంకరించుకున్నారు.

పట్టణంలోని క్షత్రియ మినీ ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన గోల్డెన్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహభరితంగా సాగింది. అరవై దశాబ్దాల క్రితం తరగతి గదుల్లో పంచుకున్న మధుర స్మృతులు మరోసారి సజీవమయ్యాయి. ఆ రోజుల్లోని క్రమశిక్షణ, గురువుల పట్ల గౌరవభావం, హైయర్ సెకండరీ విద్యకు ఉన్న విలువ వంటి అంశాలు చర్చల్లో ప్రధానంగా నిలిచాయి.

తమ తమ కుటుంబాల వివరాలు, ఉద్యోగ జీవితం, పదవీ విరమణ అనంతర కార్యకలాపాలను పరస్పరం పంచుకుంటూ స్నేహబంధాన్ని మరింత బలపరిచారు. కష్టసుఖాలను గుర్తుచేసుకుంటూ సహపంక్తి భోజనం చేసి ఆనందంగా గడిపారు.

ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు శంకరయ్య, సుధాకర్, మార్కండేయ, రవీంద్ర మోహన్‌లను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. “శేషజీవితాన్ని సమాజ సేవకు అంకితం చేస్తాం” అంటూ పూర్వ విద్యార్థులు సంకల్పం వ్యక్తం చేశారు.

ఈ సమ్మేళనంలో సుదర్శన్, రమేష్ బదామి, కర్తన్ కిషన్, మధుసూదన్, జి. మోహన్, ఆనంద్ కుమార్ గుప్తా, జెస్సు వినయ్, ఎం. రాజేశ్వర్, లక్ష్మణ్, ఎస్. మోహన్, డి. గంగాధర్, కే. సూర్యప్రకాశ్, పి. జయప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News