Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 04:44 AM

50 ఏళ్ల పాత ఆదోని ఫ్లైఓవర్‌ ప్రమాద ఘంటికలు

50 ఏళ్ల పాత ఆదోని ఫ్లైఓవర్‌ ప్రమాద ఘంటికలు

50 ఏళ్ల పాత ఆదోని ఫ్లైఓవర్‌ ప్రమాద ఘంటికలు
February 18, 2026 06:19 PM 76 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Hyderabad
Alpha Raw

కొత్త బ్రిడ్జి నిర్మాణం చేయాలి – కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ఇం డియా డిమాండ్

ఆదోని: పట్టణంలోని దాదాపు 50 ఏళ్ల చరిత్ర కలిగిన రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఫ్లైఓవర్) నేడు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిందని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆదోని పట్టణ సమితి ఆందోళన వ్యక్తం చేసింది. 1976–77లో పనులు ప్రారంభమై 1982లో రాకపోకలకు ప్రారంభమైన ఈ బ్రిడ్జి ప్రస్తుత ట్రాఫిక్ భారాన్ని మోయలేని స్థితికి చేరుకుందని నాయకులు పేర్కొన్నారు.

సిపిఐ పట్టణ కార్యదర్శి టి. వీరేష్ ఆధ్వర్యంలో సహాయ కార్యదర్శి నారాయణ, కే. రమేష్ కుమార్, డిహెచ్పిఎస్ జిల్లా సమితి సభ్యులు ఏ. విజయ్ కుమార్, ఏఐవైఎఫ్ కార్యదర్శి జి. అంజి గౌడ్, పుష్పరాజ్, ఆర్. ఈరన్న తదితరులు బ్రిడ్జిని పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ, అప్పట్లో వాహనాల రద్దీ తక్కువగా ఉండేదని, ప్రస్తుతం ట్రాఫిక్ విపరీతంగా పెరిగినా బ్రిడ్జి విస్తరణ జరగకపోవడం ఆందోళనకరమన్నారు.

బ్రిడ్జి ఇరుకుగా ఉండటం, ఎక్కే దిగే ప్రాంతాల్లో ప్రమాదకర వంపులు, రాత్రివేళ తగిన వెలుతురు లేకపోవడం, తక్కువ ఎత్తులో రక్షణ గోడలు, భారీ వాహనాల రాకపోకలు వంటి కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. గతంలో అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నప్పటికీ శాశ్వత పరిష్కారం చూపకపోవడంపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు.

ప్రస్తుత ఫ్లైఓవర్‌కు తక్షణ సాంకేతిక భద్రతా పరీక్షలు నిర్వహించి, కొత్త డబుల్ లేన్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News