Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 02:48 PM

50 ఏళ్ల పాత ఆదోని ఫ్లైఓవర్‌ ప్రమాద ఘంటికలు

50 ఏళ్ల పాత ఆదోని ఫ్లైఓవర్‌ ప్రమాద ఘంటికలు

50 ఏళ్ల పాత ఆదోని ఫ్లైఓవర్‌ ప్రమాద ఘంటికలు
February 18, 2026 06:19 PM 82 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Hyderabad
Alpha Raw

కొత్త బ్రిడ్జి నిర్మాణం చేయాలి – కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ఇం డియా డిమాండ్

ఆదోని: పట్టణంలోని దాదాపు 50 ఏళ్ల చరిత్ర కలిగిన రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఫ్లైఓవర్) నేడు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిందని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆదోని పట్టణ సమితి ఆందోళన వ్యక్తం చేసింది. 1976–77లో పనులు ప్రారంభమై 1982లో రాకపోకలకు ప్రారంభమైన ఈ బ్రిడ్జి ప్రస్తుత ట్రాఫిక్ భారాన్ని మోయలేని స్థితికి చేరుకుందని నాయకులు పేర్కొన్నారు.

సిపిఐ పట్టణ కార్యదర్శి టి. వీరేష్ ఆధ్వర్యంలో సహాయ కార్యదర్శి నారాయణ, కే. రమేష్ కుమార్, డిహెచ్పిఎస్ జిల్లా సమితి సభ్యులు ఏ. విజయ్ కుమార్, ఏఐవైఎఫ్ కార్యదర్శి జి. అంజి గౌడ్, పుష్పరాజ్, ఆర్. ఈరన్న తదితరులు బ్రిడ్జిని పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ, అప్పట్లో వాహనాల రద్దీ తక్కువగా ఉండేదని, ప్రస్తుతం ట్రాఫిక్ విపరీతంగా పెరిగినా బ్రిడ్జి విస్తరణ జరగకపోవడం ఆందోళనకరమన్నారు.

బ్రిడ్జి ఇరుకుగా ఉండటం, ఎక్కే దిగే ప్రాంతాల్లో ప్రమాదకర వంపులు, రాత్రివేళ తగిన వెలుతురు లేకపోవడం, తక్కువ ఎత్తులో రక్షణ గోడలు, భారీ వాహనాల రాకపోకలు వంటి కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. గతంలో అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నప్పటికీ శాశ్వత పరిష్కారం చూపకపోవడంపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు.

ప్రస్తుత ఫ్లైఓవర్‌కు తక్షణ సాంకేతిక భద్రతా పరీక్షలు నిర్వహించి, కొత్త డబుల్ లేన్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News