Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 10:10 PM

50 ఏళ్ల పాత ఆదోని ఫ్లైఓవర్‌ ప్రమాద ఘంటికలు

50 ఏళ్ల పాత ఆదోని ఫ్లైఓవర్‌ ప్రమాద ఘంటికలు

50 ఏళ్ల పాత ఆదోని ఫ్లైఓవర్‌ ప్రమాద ఘంటికలు
February 18, 2026 06:19 PM 86 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Hyderabad
Alpha Raw

కొత్త బ్రిడ్జి నిర్మాణం చేయాలి – కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ఇం డియా డిమాండ్

ఆదోని: పట్టణంలోని దాదాపు 50 ఏళ్ల చరిత్ర కలిగిన రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఫ్లైఓవర్) నేడు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిందని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆదోని పట్టణ సమితి ఆందోళన వ్యక్తం చేసింది. 1976–77లో పనులు ప్రారంభమై 1982లో రాకపోకలకు ప్రారంభమైన ఈ బ్రిడ్జి ప్రస్తుత ట్రాఫిక్ భారాన్ని మోయలేని స్థితికి చేరుకుందని నాయకులు పేర్కొన్నారు.

సిపిఐ పట్టణ కార్యదర్శి టి. వీరేష్ ఆధ్వర్యంలో సహాయ కార్యదర్శి నారాయణ, కే. రమేష్ కుమార్, డిహెచ్పిఎస్ జిల్లా సమితి సభ్యులు ఏ. విజయ్ కుమార్, ఏఐవైఎఫ్ కార్యదర్శి జి. అంజి గౌడ్, పుష్పరాజ్, ఆర్. ఈరన్న తదితరులు బ్రిడ్జిని పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ, అప్పట్లో వాహనాల రద్దీ తక్కువగా ఉండేదని, ప్రస్తుతం ట్రాఫిక్ విపరీతంగా పెరిగినా బ్రిడ్జి విస్తరణ జరగకపోవడం ఆందోళనకరమన్నారు.

బ్రిడ్జి ఇరుకుగా ఉండటం, ఎక్కే దిగే ప్రాంతాల్లో ప్రమాదకర వంపులు, రాత్రివేళ తగిన వెలుతురు లేకపోవడం, తక్కువ ఎత్తులో రక్షణ గోడలు, భారీ వాహనాల రాకపోకలు వంటి కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. గతంలో అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నప్పటికీ శాశ్వత పరిష్కారం చూపకపోవడంపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు.

ప్రస్తుత ఫ్లైఓవర్‌కు తక్షణ సాంకేతిక భద్రతా పరీక్షలు నిర్వహించి, కొత్త డబుల్ లేన్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News