Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:54 AM

4వ వార్డులో బీజేపీ గెలుపే లక్ష్యంగా ప్రచారం

4వ వార్డులో బీజేపీ గెలుపే లక్ష్యంగా ప్రచారం

4వ వార్డులో బీజేపీ గెలుపే లక్ష్యంగా ప్రచారం
February 10, 2026 03:27 AM 101 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు బసవకళ్యాణ్ ఎమ్మెల్యే శరణు సలగార్, మాజీ ఎమ్మెల్యే విజయ్ పాల్ రెడ్డి కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుంటూ బీజేపీ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ – వికాసం,విశ్వాసం, భద్రతకు ప్రతీకగా నిలిచిన భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపాలని ప్రజలను కోరారు.4వ వార్డు బీజేపీ అభ్యర్థి రజినీకాంత్‌కు ఓటు వేసి ఘన విజయం సాధింపజేయాలని పిలుపునిచ్చారు.బీజేపీ పాలనలోనే పట్టణాభివృద్ధి సాధ్యమవుతుందని వారు స్పష్టం చేశారు.రహదారుల అభివృద్ధి, తాగునీటి సరఫరా, పారిశుధ్య వ్యవస్థ మెరుగుదల, పేదల సంక్షేమం వంటి అంశాల్లో బీజేపీ స్పష్టమైన విధానాలతో ముందుకు సాగుతోందని తెలిపారు.మాటలకన్నా పనుల ద్వారానే అభివృద్ధిని చూపిస్తున్న పార్టీ బీజేపీ అని అన్నారు.మున్సిపాలిటీలో బీజేపీ గెలిస్తే పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను నేరుగా పరిష్కరించే పాలన బీజేపీ పాలన మాత్రమేనని పేర్కొన్నారు.ఈ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రజల్లో బీజేపీపై నమ్మకం మరింత బలపడిందని నేతలు ధీమా వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News