Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 06:57 PM

48వ వార్డులో మార్పు ఖాయం

48వ వార్డులో మార్పు ఖాయం

48వ వార్డులో మార్పు ఖాయం
February 08, 2026 11:51 PM 76 Views
Reporter
స్థానికం ప్రతినిధి : సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Biksham Goud

మున్సిపల్ ఎన్నికల వేడిలో 48వ వార్డులో మార్పు కోరుతూ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి యాకూబ్ పాషా ఆదివారం ఇంటింటి ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు.వార్డులో ఇప్పటివరకు జరిగిన నిర్లక్ష్యానికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకునే కొత్త నాయకత్వం అవసరమని స్పష్టం చేశారు. అభివృద్ధి చేయగల చేతులకే అధికారం ఇవ్వాలని పిలుపునిచ్చారు.కారు గుర్తుతో ఓటు వేసి తనను గెలిపిస్తే వార్డును అభివృద్ధి బాటలో నిలిపి, ప్రజల ఆశలు నెరవేర్చుతానని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో 48వ వార్డులో బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఈ ప్రచారంలో వార్డు నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News