మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 46వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఆంగోతు సంధ్య భావ్ సింగ్ ఆదివారం ఇంటింటి ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు.గత ప్రభుత్వ పాలనలోనే సూర్యాపేట పట్టణం అభివృద్ధి బాట పట్టిందని ఆమె స్పష్టం చేశారు. రహదారులు, తాగునీరు, పారిశుధ్యం వంటి మౌలిక వసతులు బలపడినట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలన ప్రజలకు భరోసా ఇచ్చిందని, అభివృద్ధి చేసిన చేతులకే ప్రజలు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న ఆదరణే ఈ ఎన్నికల్లో 46వ వార్డులో బీఆర్ఎస్ ఘన విజయానికి నిదర్శనమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కారు గుర్తుతో మరోసారి ప్రజల ఆశీర్వాదం లభిస్తే అభివృద్ధి వేగాన్ని మరింత పెంచుతామని తెలిపారు.ఈ ప్రచార కార్యక్రమంలో వార్డు నాయకులు, పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Share this Article1 Shares
ఆదివారం
Feb
08
2026
ప్రాంతీయ వార్తలు | సూర్యాపేట
Biksham
46వ వార్డులో బీఆర్ఎస్ జెండా ఎగురవేత ఖాయం
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 46వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఆంగోతు సంధ్య భావ్ సింగ్ ఆదివారం ఇంటింటి ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు.గత ప్రభుత్వ పాలనలోనే సూర్యాపేట పట్టణం అభివృద్ధి బాట పట్టిందని ఆమె స్పష్టం చేశారు. రహదారులు, తాగునీరు, పారిశుధ్యం వంటి మౌలిక వసతులు బలపడినట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలన ప్రజలకు భరోసా ఇచ్చిందని, అభివృద్ధి చేసిన చేతులకే ప్రజలు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న ఆదరణే ఈ ఎన్నికల్లో 46వ వార్డులో బీఆర్ఎస్ ఘన విజయానికి నిదర్శనమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కారు గుర్తుతో మరోసారి ప్రజల ఆశీర్వాదం లభిస్తే అభివృద్ధి వేగాన్ని మరింత పెంచుతామని తెలిపారు.ఈ ప్రచార కార్యక్రమంలో వార్డు నాయకులు, పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి