Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా పూలే జయంతి – సమానత్వం కోసం కృషి చేయాలి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:23 PM

34వ వార్డులో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థిగా ఆశీర్వదించండి

34వ వార్డులో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థిగా ఆశీర్వదించండి

34వ వార్డులో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థిగా ఆశీర్వదించండి
February 09, 2026 08:23 PM 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక 34వ వార్డులో తెలంగాణ రాజ్యాధికార పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా కాంటెకార్ రఘుమోహన్ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలు, సబ్బండ జాతుల సంక్షేమం కోసం పుట్టిన పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని తెలిపారు. స్థానికుడిగా, విద్యావంతుడిగా మీ బిడ్డగా మీ ముందుకు వచ్చానని పేర్కొంటూ, తనను గెలిపిస్తే వార్డు అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు.పార్టీలకు అతీతంగా ప్రజలతో మమేకమై పనిచేసే నాయకత్వం అవసరమని అన్నారు. బహుజనుల కోసం స్థాపించిన పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని స్పష్టం చేశారు. తీన్మార్ మల్లన్న నాయకత్వంలో, వట్టే జానయ్య యాదవ్ సహకారంతో ముందుకు సాగుతూ వార్డు అభ్యున్నతికి కృషి చేస్తానని తెలిపారు.వార్డు ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని చెబుతూ కత్తెర గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన తీన్మార్ మల్లన్న బహిరంగ సభకు 34వ వార్డు నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలు, మహిళలు భారీ ర్యాలీగా తరలివెళ్లారు.తనకు సహకరిస్తున్న వార్డు ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని కాంటెకార్ రఘుమోహన్ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News