34వ వార్డులో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థిగా ఆశీర్వదించండి
34వ వార్డులో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థిగా ఆశీర్వదించండి
Biksham
సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక 34వ వార్డులో తెలంగాణ రాజ్యాధికార పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా కాంటెకార్ రఘుమోహన్ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలు, సబ్బండ జాతుల సంక్షేమం కోసం పుట్టిన పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని తెలిపారు. స్థానికుడిగా, విద్యావంతుడిగా మీ బిడ్డగా మీ ముందుకు వచ్చానని పేర్కొంటూ, తనను గెలిపిస్తే వార్డు అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు.పార్టీలకు అతీతంగా ప్రజలతో మమేకమై పనిచేసే నాయకత్వం అవసరమని అన్నారు. బహుజనుల కోసం స్థాపించిన పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని స్పష్టం చేశారు. తీన్మార్ మల్లన్న నాయకత్వంలో, వట్టే జానయ్య యాదవ్ సహకారంతో ముందుకు సాగుతూ వార్డు అభ్యున్నతికి కృషి చేస్తానని తెలిపారు.వార్డు ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని చెబుతూ కత్తెర గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన తీన్మార్ మల్లన్న బహిరంగ సభకు 34వ వార్డు నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలు, మహిళలు భారీ ర్యాలీగా తరలివెళ్లారు.తనకు సహకరిస్తున్న వార్డు ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని కాంటెకార్ రఘుమోహన్ తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి