Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:33 AM

331 ప్రొహిబిటెడ్ జాబితా నుంచి ఇండ్ల తొలగింపునకు ఆర్టీవో కు వినతి

331 ప్రొహిబిటెడ్ జాబితా నుంచి ఇండ్ల తొలగింపునకు ఆర్టీవో కు వినతి

331 ప్రొహిబిటెడ్ జాబితా నుంచి ఇండ్ల తొలగింపునకు ఆర్టీవో కు వినతి
February 09, 2026 06:26 PM 318 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

331 ప్రొహిబిటెడ్ జాబితాలో దుబ్బాక ఇండ్లు

150 ఏళ్ల నివాసాలపై ‘నిషేధ’ ముద్ర

బ్యాంకు రుణాలు.. చదువులు.. వ్యాపారాలకు బ్రేక్

రామన్నపేట / దుబ్బాక :

దుబ్బాక గ్రామంలో తరతరాలుగా నివసిస్తున్న ఇండ్లను 331 ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చడం వల్ల గ్రామ ప్రజల జీవన విధానమే ప్రశ్నార్థకంగా మారింది. గత 150 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ఇండ్లకు అకస్మాత్తుగా నిషేధ ముద్ర పడటంపై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.ప్రొహిబిటెడ్ జాబితాలో ఇండ్లు ఉండటంతో పై చదువులు, చిన్న వ్యాపారాలు, బ్యాంకు రుణాలు పొందే అవకాశం పూర్తిగా కోల్పోయామని గ్రామస్తులు వాపోయారు. ఇప్పటికే బ్యాంకుల్లో మ్యాటికేషన్ అయిన ఇండ్లను కూడా రద్దు చేయలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.ఈ సమస్యపై స్పందించిన దుబ్బాక గ్రామ ప్రజలు అఖిలపక్ష ఆధ్వర్యంలో గురువారం రామన్నపేట ఎమ్మార్వో, ఆర్డీవో కు వినతి పత్రం అందజేశారు. తాము నివసిస్తున్న ఇండ్లను 331 ప్రొహిబిటెడ్ జాబితా నుంచి తొలగించి న్యాయం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గట్టు నరసింహ, ఉపసర్పంచ్ గుండాల రమేష్, ఎక్స్ ఎంపీపీ నీల దయాకర్, మాజీ సర్పంచ్ గుండాల నరసింహ, మాజీ ఉపసర్పంచ్ మేడి గణేష్లతో పాటుక్యాస వీరస్వామి, గుండాల సతీష్, గుండాల రమేష్, గుండాల రాంబాబు, పుట్టల స్వామి, కంబాలపల్లి ధనంజయ, నీల శంకరయ్య, మేకల కృష్ణ, జడల శాంతి, మసూద్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News