33 ఏళ్ల వయసులోనే ఇంద్రపాలనగరం సర్పంచ్గా విక్రమ్
33 ఏళ్ల వయసులోనే ఇంద్రపాలనగరం సర్పంచ్గా విక్రమ్
స్థానికం బృందం
33 ఏళ్ల వయసులోనే ఇంద్రపాలనగరం సర్పంచ్గా విక్రమ్
వేదికపైకి పిలిచి అభినందించిన కేటీఆర్ – పార్టీ అండ ఎప్పుడూ ఉంటుందని భరోసా
స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
కేవలం 33 ఏళ్ల వయసులోనే ఇంద్రపాలనగరం గ్రామ సర్పంచ్గా ఎన్నికైన యువ నాయకుడు గర్ధాస్ విక్రమ్కు బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం ఘన సన్మానం చేసింది. హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) విక్రమ్ను వేదికపైకి ఆహ్వానించి ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా మాజీ విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, భువనగిరి మాజీ ఎమ్మెల్యే ధాతపెళ్ల శేఖర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగం యాదవ్లు యువ సర్పంచ్కు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధి విషయంలో పార్టీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని, ఎలాంటి ఆపద వచ్చినా పార్టీ అండగా ఉంటుందని నేతలు భరోసా ఇచ్చారు.
యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని, డేర్ అండ్ డాషింగ్గా పనిచేసే యువ నాయకులకు బీఆర్ఎస్లో మంచి భవిష్యత్ ఉంటుందని నేతలు పేర్కొన్నారు. యువ సర్పంచ్ విక్రమ్కు పార్టీ రాష్ట్ర అగ్రనాయకత్వం ఇచ్చిన హామీతో మరింత ధైర్యం, ఉత్సాహం వచ్చిందని కార్యక్రమానికి హాజరైన వారు అభిప్రాయపడ్డారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి