Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:41 AM

32వార్డు అభివృద్ధి ధ్యేయంగా పని చేసి చూపిస్తా

32వార్డు అభివృద్ధి ధ్యేయంగా పని చేసి చూపిస్తా

32వార్డు అభివృద్ధి ధ్యేయంగా పని చేసి చూపిస్తా
January 30, 2026 10:26 AM 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- భారీ ర్యాలీతో తరలివచ్చి నామినేషన్ వేశారు.

- బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ముస్తాల హేమలత ఆనంద్

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

భువనగిరి మున్సిపాలిటీలోని 32వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కారు గుర్తుతో..మీ బిడ్డగా మీ ముందుకు వస్తున్నాను వార్డు మార్పు కోసం ఒక్కసారి

అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి అని కౌన్సిలర్ అభ్యర్థి ముస్తాల హేమలత ఆనంద్ అన్నారు. భువనగిరి మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ రెండవ రోజు వార్డులో

భారీ మహిళలు వృద్దులు యువకులు బిఆర్ఎస్ పార్టీ క్యాడర్ తో భారీ ప్రదర్శనగా వెళ్లి తమ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్

నిర్వహించిన ర్యాలీలో ముఖ్య అతిథులుగా

మాజీ కౌన్సిలర్ గోమారి సుధాకర్ రెడ్డి,మాజీ రైతు సమన్వయ జిల్లా చైర్మన్ కొలుపుల అమరేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంటెష్ట్ అభ్యర్థి ముస్తాల హేమలత ఆనంద్ మాట్లాడుతూ...32వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేయలేదని అన్నారు.వార్డు అభివృద్ధి ధ్యేయంగా పని చేసి చూపిస్తా అని చేతలే నా నినాదం అభివృద్ధి నా విధానం అన్నారు.నిత్యం నేను వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి వార్డు అభివృద్ధికి కృషి చేసి చూపిస్తానని అన్నారు. మార్పు కోసం ఒక్క అడుగు మన వార్దులో మీ ఓటు నుండి మొదలు కావాలని,అది మన వార్డు నుండి ప్రారంభం కావాలని

అన్నారు. వార్డు భవిష్యత్ కొరకు మీ బిడ్డగా మన వార్డు భవిష్యత్ కొరకు ఒక అవకాశం కల్పించి ఆశీర్వదించాలని ఆమె వార్డు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ వాడు అధ్యక్షులు ముస్తాల ఆనంద్,చంద్రగిరి వెంకటేష్,కానుకుంట్ల కుమార్,బిల్లా శివ,భూషాపక సుధాకర్,ఎండి.ముజాంబిల్,ఎండి.అఫ్జల్,ఎండి. ఉమర్,సాంద్ర చంద్రమౌళి,పొన్నాల కుమార్,పత్తి కొండల్, పత్తి సుధాకర్,మందుల సువర్ణ,నందిత ధనమ్మ, పత్తి పద్మ,నీల లక్ష్మి,బిల్లా భాగ్యమ్మ,సొప్పేజు విజయలక్ష్మి,ఎస్.ముత్యాలమ్మ పుట్ట నాగమ్మ,వార్డు ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News