అవకాశమిస్తే సంపూర్ణ అభివృద్ధి చేస్తా : వార్డు ప్రజలకు హామీ
భువనగిరి పట్టణ కేంద్రంలోని మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో స్థానిక తారకరామా నగర్ 32వ వార్డుకు బిజెపి కౌన్సిలర్ అభ్యర్థిగా మేడి సుమలత కోటేష్కు పార్టీ బీ-ఫారం అందజేశారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బిజెపి పార్టీ అభ్యర్థి 32వ వార్డులో గడప గడపకు తిరుగుతూ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలను కలిసిన మేడి సుమలత కోటేష్ మాట్లాడుతూ,వార్డులో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించి సమగ్ర అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో బిజెపి పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను. ఇప్పటి వరకు అన్ని పార్టీలకు ప్రజలు అవకాశం ఇచ్చారు. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు. ఒకసారి నాకు అవకాశం ఇస్తే, నిత్యం ప్రజల్లో ఉంటూ వార్డు అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తాను అని తెలిపారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా పార్టీ కార్యకర్తలతో ప్రజలను కలిసి,తమ అమూల్యమైన ఓటును కమలం పువ్వు గుర్తుకు వేసి 32వ వార్డు కౌన్సిలర్గా గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు. వార్డు ప్రజలు సానుకూలంగా స్పందిస్తూ తమ పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో బిజెపి పార్టీ సీనియర్ నాయకులు,వార్డు కమిటీ సభ్యులు,మహిళా నాయకులు,పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి