Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:11 PM

2వ వార్డు అభ్యర్థి సుర్వి మంజుల నరసింహ గౌడ్ ను అధిక మెజారిటీతో గెలిపించండి

2వ వార్డు అభ్యర్థి సుర్వి మంజుల నరసింహ గౌడ్ ను అధిక మెజారిటీతో గెలిపించండి

2వ వార్డు అభ్యర్థి సుర్వి మంజుల నరసింహ గౌడ్ ను అధిక మెజారిటీతో గెలిపించండి
February 07, 2026 09:35 AM 108 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ రెండవ మున్సిపల్ సాధారణ ఎన్నికలలో భాగంగా ఫిబ్రవరి11న జరిగే మున్సిపల్ ఎన్నికలలో చౌటుప్పల్ మున్సిపల్ పరిధి తాళ్ల సింగారం గ్రామ సిపిఐ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ 2వ వార్డు అభ్యర్థి సుర్వి మంజుల నరసింహ గౌడ్ ను అధిక మెజారిటీతో గెలిపించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నేను కొనసాగుతున్నాను.కావున చౌటుప్పల్ మున్సిపాలిటీకి అభివృద్ధి పనులు జరగాలంటే అధికార పార్టీకి ఓటేసి గెలిపించాలని ఆయన వార్డు ప్రజలను కోరారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన నుంచి అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. నిత్యం ప్రజల్లో ఉండే సుర్వి మంజుల నరసింహ గౌడ్ ను గెలిపించినట్లయితే 2వ వార్డు మరింత అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని తెలిపారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో 20 వార్డులకు 20 వార్డులు గెలిచి తీరుతామని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News