Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 12:51 AM

2వ వార్డు అభ్యర్థి సుర్వి మంజుల నరసింహ గౌడ్ ను అధిక మెజారిటీతో గెలిపించండి

2వ వార్డు అభ్యర్థి సుర్వి మంజుల నరసింహ గౌడ్ ను అధిక మెజారిటీతో గెలిపించండి

2వ వార్డు అభ్యర్థి సుర్వి మంజుల నరసింహ గౌడ్ ను అధిక మెజారిటీతో గెలిపించండి
February 07, 2026 09:35 AM 97 Views
Reporter
స్థానికం ప్రతినిధి : CHOUTUPPAL MANDAL
K.RAVI

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ రెండవ మున్సిపల్ సాధారణ ఎన్నికలలో భాగంగా ఫిబ్రవరి11న జరిగే మున్సిపల్ ఎన్నికలలో చౌటుప్పల్ మున్సిపల్ పరిధి తాళ్ల సింగారం గ్రామ సిపిఐ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ 2వ వార్డు అభ్యర్థి సుర్వి మంజుల నరసింహ గౌడ్ ను అధిక మెజారిటీతో గెలిపించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నేను కొనసాగుతున్నాను.కావున చౌటుప్పల్ మున్సిపాలిటీకి అభివృద్ధి పనులు జరగాలంటే అధికార పార్టీకి ఓటేసి గెలిపించాలని ఆయన వార్డు ప్రజలను కోరారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన నుంచి అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. నిత్యం ప్రజల్లో ఉండే సుర్వి మంజుల నరసింహ గౌడ్ ను గెలిపించినట్లయితే 2వ వార్డు మరింత అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని తెలిపారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో 20 వార్డులకు 20 వార్డులు గెలిచి తీరుతామని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News