Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మత్తుకు దూరంగా ఉంటేనే దేశ భవిష్యత్తు భద్రం: ​డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎం. సుమన్‌ కల్యాణ్‌ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 27, 2026 01:07 PM

2బీహెచ్‌కే ఇళ్ల పనులు వేగవంతం చేయాలి. అదనపు కలెక్టర్

2బీహెచ్‌కే ఇళ్ల పనులు వేగవంతం చేయాలి. అదనపు కలెక్టర్

2బీహెచ్‌కే ఇళ్ల పనులు వేగవంతం చేయాలి. అదనపు కలెక్టర్
March 18, 2026 06:04 AM 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరిలో అదనపు కలెక్టర్ సమీక్ష – శాఖలకు స్పష్టమైన ఆదేశాలు

భువనగిరి పట్టణంలో నిర్మాణంలో ఉన్న 2బీహెచ్‌కే ఇళ్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఏ. భాస్కరరావు, IAS అధికారులకు ఆదేశించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్‌పర్సన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు.

మిగిలిపోయిన పనులపై వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా సింగన్నగూడెం 2బీహెచ్‌కే కాలనీలో నీటి సరఫరా కోసం మిషన్ భగీరథ కింద ట్యాపింగ్ ఏర్పాటు చేసి, అక్కడి నుంచి గృహాలకు కనెక్షన్లు ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

అదేవిధంగా అమృత్ పథకం కింద వాటర్ పైప్‌లైన్ల ఏర్పాటును వేగవంతం చేయాలని, విద్యుత్ సరఫరాకు సంబంధించి మిగిలిన పనులను మున్సిపాలిటీ తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. మిగులు నిధులను వినియోగిస్తూ హౌసింగ్ శాఖ ప్లంబింగ్, ఎలక్ట్రిసిటీ పనులను త్వరగా పూర్తిచేయాలని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జి. రామలింగం, మున్సిపల్, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, విద్యుత్, హౌసింగ్, పబ్లిక్ హెల్త్ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News