Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 18, 2026 09:13 AM

2బీహెచ్‌కే ఇళ్ల పనులు వేగవంతం చేయాలి. అదనపు కలెక్టర్

2బీహెచ్‌కే ఇళ్ల పనులు వేగవంతం చేయాలి. అదనపు కలెక్టర్

2బీహెచ్‌కే ఇళ్ల పనులు వేగవంతం చేయాలి. అదనపు కలెక్టర్
March 18, 2026 06:04 AM 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

భువనగిరిలో అదనపు కలెక్టర్ సమీక్ష – శాఖలకు స్పష్టమైన ఆదేశాలు

భువనగిరి పట్టణంలో నిర్మాణంలో ఉన్న 2బీహెచ్‌కే ఇళ్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఏ. భాస్కరరావు, IAS అధికారులకు ఆదేశించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్‌పర్సన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు.

మిగిలిపోయిన పనులపై వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా సింగన్నగూడెం 2బీహెచ్‌కే కాలనీలో నీటి సరఫరా కోసం మిషన్ భగీరథ కింద ట్యాపింగ్ ఏర్పాటు చేసి, అక్కడి నుంచి గృహాలకు కనెక్షన్లు ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

అదేవిధంగా అమృత్ పథకం కింద వాటర్ పైప్‌లైన్ల ఏర్పాటును వేగవంతం చేయాలని, విద్యుత్ సరఫరాకు సంబంధించి మిగిలిన పనులను మున్సిపాలిటీ తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. మిగులు నిధులను వినియోగిస్తూ హౌసింగ్ శాఖ ప్లంబింగ్, ఎలక్ట్రిసిటీ పనులను త్వరగా పూర్తిచేయాలని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జి. రామలింగం, మున్సిపల్, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, విద్యుత్, హౌసింగ్, పబ్లిక్ హెల్త్ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News