20వ వార్డులో బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం జోరు
20వ వార్డులో బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం జోరు
K.RAVI
చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 20వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అత్తర్ పాషా ను గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం చింతల వెంకటేశ్వర్ రెడ్డి నిర్వహించారు. చింతల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి గెలిచిన తర్వాత సంక్షేమ పథకాలు తుంగలో తొక్కింది అని అన్నారు.మళ్ళీ ఆ పార్టీకి ఓటు వేయొద్దని మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులని గెలిపించాలని కోరారు. తరువాత రాష్ట్రంలోవచ్చే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని అన్నారు.20 వ వార్డులో అత్తర్ పాషా ని గెలిపించాలని ఇంటింటికి ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గీర్కాటి నిరంజన్ గౌడ్,చౌటుప్పల పట్టణ అధ్యక్షులు బొమ్మిరెడ్డి వెంకటరెడ్డి, పెద్దింటి బుచ్చిరెడ్డి,మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు సుర్వి మల్లేష్ గౌడ్,మాజీ కౌన్సిలర్ గోపగోని లక్ష్మణ్ గౌడ్, ఖయ్యూం,రాము,మున్నేరు, జమాల్, ముసిర్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి