19వ వార్డు అభివృద్ధి బిజెపితోనే సాధ్యం
19వ వార్డు అభివృద్ధి బిజెపితోనే సాధ్యం
K.RAVI
19 వ వార్డు బిజెపి పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి రమణ గోని శంకరయ్య
చౌటుప్పల్ పురపాలక కేంద్రంలోని 19వ వార్డు అభివృద్ధి సాధించాలంటే భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుందని 19 వ వార్డు బిజెపి పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి రమణగోని శంకరయ్య అన్నారు.శనివారం ఆయన గడపగడపకు ప్రచారం చేశారు.కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.19వ వార్డు వడ్ల దాటి ఏరియాలో ప్రచారంలో భాగంగా తిరుగుతూ 19 వార్డులో మంచినీటి సమస్య, మురుగు కాలువల సమస్య వంటి మౌలిక సదుపాయా కరువైయాన్నారు.దోమలు,ఈగలతోటి కాలనివాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.దోమల వలన డెంగ్యూ మలేరియా వంటి జ్వరాలు వ్యాపించి ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారని వాపోయారు. ఇంతకుముందు గెలిచిన కౌన్సిలర్ ప్రజలను, వార్డులో మౌలిక వసతులను గాలికి వదిలేసి తన ఖజానా నింపుకున్నారన్నారు. వార్డు ప్రజలు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నాయకుడిగా కాకుండా సేవకుడిగా ప్రజా సేవ చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి