Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పనసం అంజయ్య గౌడ్‌కు కన్నీటి నివాళి ఆర్. డి. టీ సంస్థ కి సహాయం చేయడం నా అదృష్టం :- లోకేష్ సీఎం భూమి పూజ చేయడానికి ఏర్పాట్లు సిద్ధం సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 15, 2026 10:06 PM

18 ఏళ్ల తర్వాత ఒకేచోటకు.. న్యాల్కల్ జెడ్పీహెచ్‌ఎస్ 2007-08 బ్యాచ్ ‘మైత్రి మిలన్’కు సర్వం సిద్ధం

18 ఏళ్ల తర్వాత ఒకేచోటకు.. న్యాల్కల్ జెడ్పీహెచ్‌ఎస్ 2007-08 బ్యాచ్ ‘మైత్రి మిలన్’కు సర్వం సిద్ధం

18 ఏళ్ల తర్వాత ఒకేచోటకు.. న్యాల్కల్ జెడ్పీహెచ్‌ఎస్ 2007-08 బ్యాచ్ ‘మైత్రి మిలన్’కు సర్వం సిద్ధం
May 15, 2026 09:05 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్‌ఎస్)లో 2007-2008 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు 18 ఏళ్ల తర్వాత మరోసారి కలుసుకోబోతున్నారు. “మైత్రి మిలన్” పేరుతో నిర్వహిస్తున్న ఈ ఆత్మీయ పూర్వ విద్యార్థుల సమ్మేళనం మే 17న న్యాల్కల్‌లోని శ్రీ కృష్ణ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరగనుంది.చిన్ననాటి స్నేహాలు, పాఠశాల జ్ఞాపకాలు, గురువుల బోధనలు, సరదా సంఘటనలను మరోసారి గుర్తు చేసుకుంటూ పూర్వ విద్యార్థులు ఈ సమావేశానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చదువు పూర్తై ఉద్యోగాలు, వ్యాపారాలు, కుటుంబ బాధ్యతలతో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన స్నేహితులు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఒకేచోట కలుసుకోనుండటం విశేషంగా మారింది.ఈ సందర్భంగా పూర్వ ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తు కోసం గురువులు నిరంతరం కృషి చేస్తారని, జన్మనిచ్చిన తల్లిదండ్రులతో పాటు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను జీవితాంతం గౌరవించాలని సూచించారు. విద్యార్థి విజయం సాధిస్తే గురువులకు గర్వంగా ఉంటుందని, విఫలమైతే ముందుగా బాధపడేది కూడా గురువులేనని తెలిపారు.సమ్మేళనంలో ప్రధాన ఉపాధ్యాయులు రాజప్ప, పద్మయ్య, లాలయ్య, అనంత్ రెడ్డి, మీనా, కవిత, గౌతం, శ్రీనివాస్, తుకారాం, పద్మవతి,

నరసింహారెడ్డి తో

పాటు పూర్వ విద్యార్థులు పాల్గొననున్నారు. హైదరాబాద్, , సంగారెడ్డి, జహీరాబాద్, బీదర్ తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరుకానుండటంతో న్యాల్కల్‌లో పూర్వ విద్యార్థుల కలయికకు ప్రత్యేక ఆకర్షణ ఏర్పడింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News