Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:10 AM

18 ఏళ్ల తర్వాత ఒకేచోటకు.. న్యాల్కల్ జెడ్పీహెచ్‌ఎస్ 2007-08 బ్యాచ్ ‘మైత్రి మిలన్’కు సర్వం సిద్ధం

18 ఏళ్ల తర్వాత ఒకేచోటకు.. న్యాల్కల్ జెడ్పీహెచ్‌ఎస్ 2007-08 బ్యాచ్ ‘మైత్రి మిలన్’కు సర్వం సిద్ధం

18 ఏళ్ల తర్వాత ఒకేచోటకు.. న్యాల్కల్ జెడ్పీహెచ్‌ఎస్ 2007-08 బ్యాచ్ ‘మైత్రి మిలన్’కు సర్వం సిద్ధం
15-05-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్‌ఎస్)లో 2007-2008 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు 18 ఏళ్ల తర్వాత మరోసారి కలుసుకోబోతున్నారు. “మైత్రి మిలన్” పేరుతో నిర్వహిస్తున్న ఈ ఆత్మీయ పూర్వ విద్యార్థుల సమ్మేళనం మే 17న న్యాల్కల్‌లోని శ్రీ కృష్ణ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరగనుంది.చిన్ననాటి స్నేహాలు, పాఠశాల జ్ఞాపకాలు, గురువుల బోధనలు, సరదా సంఘటనలను మరోసారి గుర్తు చేసుకుంటూ పూర్వ విద్యార్థులు ఈ సమావేశానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చదువు పూర్తై ఉద్యోగాలు, వ్యాపారాలు, కుటుంబ బాధ్యతలతో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన స్నేహితులు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఒకేచోట కలుసుకోనుండటం విశేషంగా మారింది.ఈ సందర్భంగా పూర్వ ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తు కోసం గురువులు నిరంతరం కృషి చేస్తారని, జన్మనిచ్చిన తల్లిదండ్రులతో పాటు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను జీవితాంతం గౌరవించాలని సూచించారు. విద్యార్థి విజయం సాధిస్తే గురువులకు గర్వంగా ఉంటుందని, విఫలమైతే ముందుగా బాధపడేది కూడా గురువులేనని తెలిపారు.సమ్మేళనంలో ప్రధాన ఉపాధ్యాయులు రాజప్ప, పద్మయ్య, లాలయ్య, అనంత్ రెడ్డి, మీనా, కవిత, గౌతం, శ్రీనివాస్, తుకారాం, పద్మవతి,

నరసింహారెడ్డి తో

పాటు పూర్వ విద్యార్థులు పాల్గొననున్నారు. హైదరాబాద్, , సంగారెడ్డి, జహీరాబాద్, బీదర్ తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరుకానుండటంతో న్యాల్కల్‌లో పూర్వ విద్యార్థుల కలయికకు ప్రత్యేక ఆకర్షణ ఏర్పడింది.

Sthanikam

18 ఏళ్ల తర్వాత ఒకేచోటకు.. న్యాల్కల్ జెడ్పీహెచ్‌ఎస్ 2007-08 బ్యాచ్ ‘మైత్రి మిలన్’కు సర్వం సిద్ధం

Article Image

న్యాల్కల్: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్‌ఎస్)లో 2007-2008 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు 18 ఏళ్ల తర్వాత మరోసారి కలుసుకోబోతున్నారు. “మైత్రి మిలన్” పేరుతో నిర్వహిస్తున్న ఈ ఆత్మీయ పూర్వ విద్యార్థుల సమ్మేళనం మే 17న న్యాల్కల్‌లోని శ్రీ కృష్ణ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరగనుంది.చిన్ననాటి స్నేహాలు, పాఠశాల జ్ఞాపకాలు, గురువుల బోధనలు, సరదా సంఘటనలను మరోసారి గుర్తు చేసుకుంటూ పూర్వ విద్యార్థులు ఈ సమావేశానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చదువు పూర్తై ఉద్యోగాలు, వ్యాపారాలు, కుటుంబ బాధ్యతలతో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన స్నేహితులు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఒకేచోట కలుసుకోనుండటం విశేషంగా మారింది.ఈ సందర్భంగా పూర్వ ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తు కోసం గురువులు నిరంతరం కృషి చేస్తారని, జన్మనిచ్చిన తల్లిదండ్రులతో పాటు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను జీవితాంతం గౌరవించాలని సూచించారు. విద్యార్థి విజయం సాధిస్తే గురువులకు గర్వంగా ఉంటుందని, విఫలమైతే ముందుగా బాధపడేది కూడా గురువులేనని తెలిపారు.సమ్మేళనంలో ప్రధాన ఉపాధ్యాయులు రాజప్ప, పద్మయ్య, లాలయ్య, అనంత్ రెడ్డి, మీనా, కవిత, గౌతం, శ్రీనివాస్, తుకారాం, పద్మవతి,

నరసింహారెడ్డి తో

పాటు పూర్వ విద్యార్థులు పాల్గొననున్నారు. హైదరాబాద్, , సంగారెడ్డి, జహీరాబాద్, బీదర్ తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరుకానుండటంతో న్యాల్కల్‌లో పూర్వ విద్యార్థుల కలయికకు ప్రత్యేక ఆకర్షణ ఏర్పడింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News