PRINT TIME: April 10, 2026 12:04 AM
17వ వార్డులో విద్యుత్ సమస్యలు… ట్రాన్స్కో ఏఈకి వినతిపత్రం
17వ వార్డులో విద్యుత్ సమస్యలు… ట్రాన్స్కో ఏఈకి వినతిపత్రం
March 10, 2026 09:21 PM
70 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
చౌటుప్పల్ పురపాలక సంఘం పరిధిలోని 17వ వార్డులో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ట్రాన్స్కో ఏఈ సతీష్ కి వినతిపత్రం అందజేశారు. 17వ వార్డు కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి–సాయిలు అధికారిని కలిసి వార్డులో తరచుగా ఎదురవుతున్న విద్యుత్ అంతరాయాలు, లైన్ సమస్యలను వివరించి త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ జవహర్ బాల్ మంచ్ రాష్ట్ర కోఆర్డినేటర్ పెద్దగోని రమేష్ గౌడ్, చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మాధనీ గోపాల్, 17వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎస్కే యూసుఫ్, చౌటుప్పల్ మున్సిపల్ ఐఎన్టీయూసీ అధ్యక్షుడు ముత్యాల గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి