150 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
150 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
GADDAM JAGANMOHAN REDDY
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలోని దుందిరాలపాడు గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 150 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.
తునికిపాడు గ్రామానికి చెందిన కొమ్మినేని వెంకటేశ్వరరావు గ్రామాల్లో తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి, ఆ బియ్యాన్ని కోళ్ల ఫారాల్లో మేతగా వినియోగించుకునేందుకు పొలంలో నిల్వ చేసినట్లు వెల్లడైంది.
సమాచారం అందుకున్న తహసీల్దార్ వి. రాజాకుమారి స్థానిక ఎస్సై జి. అనిల్, పిడిఎస్ డిప్యూటీ తహసీల్దార్ శివ నాగరాజుతో కలిసి ఘటన స్థలానికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ నిల్వ చేసిన మొత్తం 300 బస్తాల్లో ఉన్న 150 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తహసీల్దార్ తెలిపారు.
ఈ ఘటనపై కొమ్మినేని వెంకటేశ్వరరావుపై 6ఏ చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించినా, నిల్వ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి