Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు నరాలు తెగే ఉత్కంఠ... ఢిల్లీ చేతిలో గెలుపు.. గుజరాత్ తన్నుకుపోయింది! “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:04 AM

150 ఏళ్ల చరిత్ర గల శ్రీ రామలింగేశ్వర ఆలయాన్ని సందర్శించిన మాధవానంద స్వామి

150 ఏళ్ల చరిత్ర గల శ్రీ రామలింగేశ్వర ఆలయాన్ని సందర్శించిన మాధవానంద స్వామి

150 ఏళ్ల చరిత్ర గల శ్రీ రామలింగేశ్వర ఆలయాన్ని సందర్శించిన మాధవానంద స్వామి
March 09, 2026 09:47 AM 253 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర దేవాలయాన్ని మాధవానంద ఆశ్రమ నిర్వాహకులు శ్రీ శ్రీ మాధవానంద స్వామి సందర్శించారు.

ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాల నేపథ్యంలో దేవాలయ అభివృద్ధి పనుల గురించి దేవాలయ కమిటీ అధ్యక్షులు ఎరుకల రామదాస్ గౌడ్ స్వామిజీకి వివరించారు.

ఈ సందర్భంగా మాధవానంద స్వామి మాట్లాడుతూ, పురాతనమైన ఈ దేవాలయాన్ని సందర్శించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో నిర్మించబడిన ఈ ఆలయం సుమారు 150 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని తెలిపారు.

ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాలు సక్రమంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ, దేవాలయ అభివృద్ధికి సంబంధించి కొన్ని ముఖ్యమైన సూచనలు, సలహాలు దేవాలయ కమిటీ అధ్యక్షులు ఎరుకల రామదాస్ గౌడ్‌కు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రధాన అర్చకులు కొండూరు నరసింహ శర్మ, కొండూరు మనోహర్ రావు, కొండూరు వెంకట కిషన్ రావు, దేవాలయ ప్రధాన కార్యదర్శి దోర్నాల నరేష్, కోశాధికారి కొండూరు వికాస్‌, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News