150 ఏళ్ల చరిత్ర గల శ్రీ రామలింగేశ్వర ఆలయాన్ని సందర్శించిన మాధవానంద స్వామి
150 ఏళ్ల చరిత్ర గల శ్రీ రామలింగేశ్వర ఆలయాన్ని సందర్శించిన మాధవానంద స్వామి
K.RAVI
చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర దేవాలయాన్ని మాధవానంద ఆశ్రమ నిర్వాహకులు శ్రీ శ్రీ మాధవానంద స్వామి సందర్శించారు.
ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాల నేపథ్యంలో దేవాలయ అభివృద్ధి పనుల గురించి దేవాలయ కమిటీ అధ్యక్షులు ఎరుకల రామదాస్ గౌడ్ స్వామిజీకి వివరించారు.
ఈ సందర్భంగా మాధవానంద స్వామి మాట్లాడుతూ, పురాతనమైన ఈ దేవాలయాన్ని సందర్శించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో నిర్మించబడిన ఈ ఆలయం సుమారు 150 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని తెలిపారు.
ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాలు సక్రమంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ, దేవాలయ అభివృద్ధికి సంబంధించి కొన్ని ముఖ్యమైన సూచనలు, సలహాలు దేవాలయ కమిటీ అధ్యక్షులు ఎరుకల రామదాస్ గౌడ్కు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రధాన అర్చకులు కొండూరు నరసింహ శర్మ, కొండూరు మనోహర్ రావు, కొండూరు వెంకట కిషన్ రావు, దేవాలయ ప్రధాన కార్యదర్శి దోర్నాల నరేష్, కోశాధికారి కొండూరు వికాస్, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి