13వ వార్డులో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం
13వ వార్డులో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం
Biksham Goud
అధికార పార్టీయే వార్డు అభివృద్ధికి హామీ
చేయి గుర్తుకే ఓటు వేయాలని పిలుపు
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 13వ వార్డులో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ సర్పంచ్ ఉగ్గం బుచ్చిరాములు ఆధ్వర్యంలో మానస నగర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూక్యా కౌసల్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా భూక్యా కౌసల్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున వార్డు అభివృద్ధికి మున్సిపాలిటీ నుంచి అధిక నిధులు తీసుకొచ్చి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఓటర్లకు భరోసా ఇచ్చారు. ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులను వేగంగా చేపడతామని తెలిపారు.అందరూ చేయి గుర్తుకే ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. అధికార పార్టీ అభ్యర్థి గెలుపుతోనే వార్డు అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో 13వ వార్డు కాంగ్రెస్ నాయకులు ఉగ్గం అశోక్ యాదవ్, రాపర్తి రాములు, భూక్యా మహేష్, రవి నాయక్, బాలెంల సంజీవ, బాలెంల శంకర్, వెంకటేష్, దస్రు నాయక్, రవి, అంతటి ఉప్పలయ్య, చెరుకు గంగరాజు, సోమ్లా తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి