Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా పూలే జయంతి – సమానత్వం కోసం కృషి చేయాలి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:17 PM

13వ వార్డులో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం

13వ వార్డులో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం

13వ వార్డులో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం
February 08, 2026 03:04 PM 168 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అధికార పార్టీయే వార్డు అభివృద్ధికి హామీ

చేయి గుర్తుకే ఓటు వేయాలని పిలుపు

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 13వ వార్డులో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ సర్పంచ్ ఉగ్గం బుచ్చిరాములు ఆధ్వర్యంలో మానస నగర్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూక్యా కౌసల్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా భూక్యా కౌసల్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున వార్డు అభివృద్ధికి మున్సిపాలిటీ నుంచి అధిక నిధులు తీసుకొచ్చి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఓటర్లకు భరోసా ఇచ్చారు. ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులను వేగంగా చేపడతామని తెలిపారు.అందరూ చేయి గుర్తుకే ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. అధికార పార్టీ అభ్యర్థి గెలుపుతోనే వార్డు అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో 13వ వార్డు కాంగ్రెస్ నాయకులు ఉగ్గం అశోక్ యాదవ్, రాపర్తి రాములు, భూక్యా మహేష్, రవి నాయక్, బాలెంల సంజీవ, బాలెంల శంకర్, వెంకటేష్, దస్రు నాయక్, రవి, అంతటి ఉప్పలయ్య, చెరుకు గంగరాజు, సోమ్లా తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News