13వ వార్డు నుంచి కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థిగా మొహమ్మద్ మైనోద్దీన్ ఖురేషి బరిలో
13వ వార్డు నుంచి కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థిగా మొహమ్మద్ మైనోద్దీన్ ఖురేషి బరిలో
Krishna
నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ
నారాయణఖేడ్ మున్సిపాలిటీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మొహమ్మద్ మైనోద్దీన్ ఖురేషి ఈరోజు (గురువారం) అధికారికంగా తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్, నారాయణఖేడ్ నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పి. సంజీవరెడ్డి సహకారం లభించినట్లు అభ్యర్థి తెలిపారు.మున్సిపల్ ఎన్నికల్లో ఖేడ్ మున్సిపాలిటీలోని మొత్తం 15 వార్డులకు పోటీ జరుగుతోంది. అందులో భాగంగా 13వ వార్డుకు ఆయన అధికారికంగా నామినేషన్ సమర్పించడం జరిగింది. నామినేషన్ ప్రక్రియలో పోలింగ్ రిటర్నింగ్ అధికారులకు అవసరమైన పత్రాలను ఆయన అందజేశారు.మొహమ్మద్ మైనోద్దీన్ ఖురేషి మాట్లాడుతూ,కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఇచ్చిన ఆదేశాలు, సూచనల మేరకు నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. వార్డు ప్రజల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని, కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రజల వద్దకు తీసుకెళ్తానని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని అభ్యర్థికి సంఘీభావం వ్యక్తపరిచారు. 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ తరఫున బలమైన పోటీకి సిద్ధమని స్థానికంగా చర్చ జరుగుతోంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి