Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 12:38 AM

13వ వార్డు నుంచి కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థిగా మొహమ్మద్ మైనోద్దీన్ ఖురేషి బరిలో

13వ వార్డు నుంచి కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థిగా మొహమ్మద్ మైనోద్దీన్ ఖురేషి బరిలో

13వ వార్డు నుంచి కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థిగా మొహమ్మద్ మైనోద్దీన్ ఖురేషి బరిలో
29-01-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

నారాయణఖేడ్ మున్సిపాలిటీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మొహమ్మద్ మైనోద్దీన్ ఖురేషి ఈరోజు (గురువారం) అధికారికంగా తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్, నారాయణఖేడ్ నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పి. సంజీవరెడ్డి సహకారం లభించినట్లు అభ్యర్థి తెలిపారు.మున్సిపల్ ఎన్నికల్లో ఖేడ్ మున్సిపాలిటీలోని మొత్తం 15 వార్డులకు పోటీ జరుగుతోంది. అందులో భాగంగా 13వ వార్డుకు ఆయన అధికారికంగా నామినేషన్ సమర్పించడం జరిగింది. నామినేషన్ ప్రక్రియలో పోలింగ్ రిటర్నింగ్ అధికారులకు అవసరమైన పత్రాలను ఆయన అందజేశారు.మొహమ్మద్ మైనోద్దీన్ ఖురేషి మాట్లాడుతూ,కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఇచ్చిన ఆదేశాలు, సూచనల మేరకు నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. వార్డు ప్రజల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని, కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రజల వద్దకు తీసుకెళ్తానని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని అభ్యర్థికి సంఘీభావం వ్యక్తపరిచారు. 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ తరఫున బలమైన పోటీకి సిద్ధమని స్థానికంగా చర్చ జరుగుతోంది.

Sthanikam

13వ వార్డు నుంచి కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థిగా మొహమ్మద్ మైనోద్దీన్ ఖురేషి బరిలో

Article Image

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

నారాయణఖేడ్ మున్సిపాలిటీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మొహమ్మద్ మైనోద్దీన్ ఖురేషి ఈరోజు (గురువారం) అధికారికంగా తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్, నారాయణఖేడ్ నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పి. సంజీవరెడ్డి సహకారం లభించినట్లు అభ్యర్థి తెలిపారు.మున్సిపల్ ఎన్నికల్లో ఖేడ్ మున్సిపాలిటీలోని మొత్తం 15 వార్డులకు పోటీ జరుగుతోంది. అందులో భాగంగా 13వ వార్డుకు ఆయన అధికారికంగా నామినేషన్ సమర్పించడం జరిగింది. నామినేషన్ ప్రక్రియలో పోలింగ్ రిటర్నింగ్ అధికారులకు అవసరమైన పత్రాలను ఆయన అందజేశారు.మొహమ్మద్ మైనోద్దీన్ ఖురేషి మాట్లాడుతూ,కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఇచ్చిన ఆదేశాలు, సూచనల మేరకు నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. వార్డు ప్రజల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని, కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రజల వద్దకు తీసుకెళ్తానని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని అభ్యర్థికి సంఘీభావం వ్యక్తపరిచారు. 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ తరఫున బలమైన పోటీకి సిద్ధమని స్థానికంగా చర్చ జరుగుతోంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News