13వ వార్డు కౌన్సిలర్కు కాలనీవాసుల ఘన సన్మానం
13వ వార్డు కౌన్సిలర్కు కాలనీవాసుల ఘన సన్మానం
K.RAVI
కృష్ణనగర్–కంచరకుట్ల కాలనీ అభివృద్ధికి కట్టుబడి పనిచేయాలి: స్థానికుల ఆకాంక్ష
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డీ ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్గా గెలుపొందిన చౌటుప్పల్ మున్సిపల్ 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్కు కాలనీవాసులు ఘన సన్మానం నిర్వహించారు. రాజగోపాల్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు కృష్ణనగర్–కంచరకుట్ల కాలనీ వాసులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కౌన్సిలర్ వాణి విప్లవ్ కుమార్ గౌడ్కు శాలువా కప్పి, పూలమాలలు వేసి, శ్రీకృష్ణుడి చిత్రపటాన్ని అందజేశారు. మా కాలనీకి మీరు రావడం చాలా ఆనందంగా ఉందని, మీ గెలుపు మా కాలనీ అభివృద్ధికి దిక్సూచి కావాలని కోరుకుంటున్నామని కాలనీవాసులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మేరెడ్డి మహేందర్ రెడ్డి, చెవగొని వెంకటేష్ గౌడ్, వర్కాల కుమార్ గౌడ్, మార్గం నరసింహ యాదవ్, గయ్యని జంగయ్య, మాల శివ సాయి రెడ్డి, ఎంటర్ రమేష్, సభావతి నాగేష్, నేత కరెంటు రాజు, చందు నాయక్, మేరెడ్డి కృష్ణవేణి, వనం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.కాలనీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని కౌన్సిలర్ వాణి విప్లవ్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి