12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి. దుర్గం పుల్లారావు కొమ్ము ఆనందం
12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి. దుర్గం పుల్లారావు కొమ్ము ఆనందం
GADDAM JAGANMOHAN REDDY
చాట్రాయిలో సిపిఐ అనుబంధ సంఘాల పిలుపు
ఈ నెల 12వ తేదీన గురువారం దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సిపిఐ అనుబంధ వ్యవసాయకార్మిక సంఘం చాట్రాయి మండల కార్యదర్శి కొమ్ము ఆనందం, సిపిఐ ఎంఎల్ ఎలూరి జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు పిలుపునిచ్చారు.ఈ మేరకు బుధవారం చాట్రాయి మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్త సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సమ్మెలో విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ వర్కర్లు, భవన నిర్మాణ కార్మికులు, ఇతర ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని కోరారు.ప్రజల హక్కులు, జీవన భద్రత కోసం ఈ సమ్మె అవసరమని, అందరూ ఏకమై ఉద్యమంలో భాగస్వాములు కావాలని నాయకులు పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి