Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:56 PM

12 గంటల పని విధానం, నాలుగు లేబర్ కొడులను రద్దు చేయాలిని ఆర్డీవోకు వినతి

12 గంటల పని విధానం, నాలుగు లేబర్ కొడులను రద్దు చేయాలిని ఆర్డీవోకు వినతి

12 గంటల పని విధానం, నాలుగు లేబర్ కొడులను రద్దు చేయాలిని ఆర్డీవోకు వినతి
February 12, 2026 11:22 PM 149 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

దేశవ్యాప్త సమ్మె గురువారం చౌటుప్పల్ కేంద్రంలో కార్మిక వర్గం సిఐటియు ఆధ్వర్యంలో రంగన్న భవనం నుండి పెద్ద ఎత్తున ప్రదర్శన బయలుదేరి తంగడపల్లి రోడ్డు, బస్టాండ్ మీదుగా నినాదాలు చేస్తూ 12 గంటల పని విధానం రద్దు చేయాలని, నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని ఆర్డిఓ ఆఫీస్ ముందు ధర్నా చేసి ఆర్డిఓకు వినతిపత్రం అందజేయడం జరిగింది. సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఆదిమూలనందీశ్వర్ అధ్యక్షతన ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా కోశాధికారి ఎండి పాషా మాట్లాడుతూ, అనేక దశాబ్దాలుగా పోరాటం ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడులను తీసుకొచ్చిందని 12 గంటల పని విధానాన్ని అమలు చేయాలని తీసుకొచ్చింది. ఇది కార్మికుల ప్రమాణాలను ఉల్లయించడమేనని విమర్శించారు. ఈపీఎఫ్, ఈఎస్ఐ పెన్షన్ వంటి సామాజిక భద్రతా పథకాలను కేంద్రం బలహీనపరిచింది. ఈ సమ్మె దేశాన్ని రక్షించడానికి కార్మికుల గౌరవాన్ని పునరుద్ధరించడానికి జరిగే పోరాటమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బూరుగు కృష్ణారెడ్డి సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు చీమ కండ్ల శ్రీరాములు, కల్వకుంట్ల శివకుమార్, జొన్నగంటి దేవయా, కల్లుగీత కార్మికుల సంఘం అధ్యక్షులు రాగిరు కృష్ణయ్య, రైతు సంఘం నాయకులు ఆకుల ధర్మయ్య, గ్రామపంచాయతీ జిల్లా ఉపాధ్యక్షులు మండ్ర శీను, మండల కార్యదర్శి గుడ్డేటి పాపయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బోయ యాదయ్య, నాయకులు ఎలవర్తి నరసింహ, బందెల ఈశ్వర్, ఉబ్బు మారమ్మ, ఆకుల ధర్మయ్య, మేకల శ్రీశైలం, చప్పి లక్ష్మారెడ్డి, చెక్క ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News