Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:40 AM

12 గంటల పని విధానం, నాలుగు లేబర్ కొడులను రద్దు చేయాలిని ఆర్డీవోకు వినతి

12 గంటల పని విధానం, నాలుగు లేబర్ కొడులను రద్దు చేయాలిని ఆర్డీవోకు వినతి

12 గంటల పని విధానం, నాలుగు లేబర్ కొడులను రద్దు చేయాలిని ఆర్డీవోకు వినతి
February 12, 2026 11:22 PM 146 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

దేశవ్యాప్త సమ్మె గురువారం చౌటుప్పల్ కేంద్రంలో కార్మిక వర్గం సిఐటియు ఆధ్వర్యంలో రంగన్న భవనం నుండి పెద్ద ఎత్తున ప్రదర్శన బయలుదేరి తంగడపల్లి రోడ్డు, బస్టాండ్ మీదుగా నినాదాలు చేస్తూ 12 గంటల పని విధానం రద్దు చేయాలని, నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని ఆర్డిఓ ఆఫీస్ ముందు ధర్నా చేసి ఆర్డిఓకు వినతిపత్రం అందజేయడం జరిగింది. సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఆదిమూలనందీశ్వర్ అధ్యక్షతన ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా కోశాధికారి ఎండి పాషా మాట్లాడుతూ, అనేక దశాబ్దాలుగా పోరాటం ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడులను తీసుకొచ్చిందని 12 గంటల పని విధానాన్ని అమలు చేయాలని తీసుకొచ్చింది. ఇది కార్మికుల ప్రమాణాలను ఉల్లయించడమేనని విమర్శించారు. ఈపీఎఫ్, ఈఎస్ఐ పెన్షన్ వంటి సామాజిక భద్రతా పథకాలను కేంద్రం బలహీనపరిచింది. ఈ సమ్మె దేశాన్ని రక్షించడానికి కార్మికుల గౌరవాన్ని పునరుద్ధరించడానికి జరిగే పోరాటమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బూరుగు కృష్ణారెడ్డి సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు చీమ కండ్ల శ్రీరాములు, కల్వకుంట్ల శివకుమార్, జొన్నగంటి దేవయా, కల్లుగీత కార్మికుల సంఘం అధ్యక్షులు రాగిరు కృష్ణయ్య, రైతు సంఘం నాయకులు ఆకుల ధర్మయ్య, గ్రామపంచాయతీ జిల్లా ఉపాధ్యక్షులు మండ్ర శీను, మండల కార్యదర్శి గుడ్డేటి పాపయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బోయ యాదయ్య, నాయకులు ఎలవర్తి నరసింహ, బందెల ఈశ్వర్, ఉబ్బు మారమ్మ, ఆకుల ధర్మయ్య, మేకల శ్రీశైలం, చప్పి లక్ష్మారెడ్డి, చెక్క ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News