Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:39 AM

11వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం

11వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం

11వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం
February 09, 2026 05:37 PM 229 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పున్న కైలాస్ నేత కాంగ్రెస్ పార్టీ నల్లగొండ అధ్యక్షులు

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తుంది

చౌటుప్పల్ మున్సిపాలిటీ ఎలక్షన్ లో భాగంగా సోమవారం 11 వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోశిక వినయ్ కుమార్ విజయాన్ని కాంక్షిస్తూ నల్గొండ జిల్లా అధ్యక్షులు పున్న కైలాష్ నేత ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా చేయి గుర్తుపై తన అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత 2 సం;లుగా రోజుకు 18 గంటలు కష్టపడుతూ తెలంగాణ అభివృద్ధి పాటుపడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి తిరుగులేదు.అభివృద్ధి సంక్షేమం వారి నాయకత్వంలో ముందుకు సాగుతుంది. అప్పులు పాలైన తెలంగాణ రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు.ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలో 70% పైగా కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు.నల్గొండ జిల్లాలో జరుగుతున్న నల్గొండ కార్పొరేషన్ లో సహా 6 మున్సిపాలిటీలను కైవనం చేసుకుంటాం. బిఆర్ఎస్ బిజెపికి ఓటు వేస్తే దండగ సంక్షేమ పథకాలు ఆగిపోతాయి.గత 2 సంవత్సరాలుగా 19 వేల కోట్లు నిధులను పట్టణాలకు ఖర్చు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి దే. సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, కొత్త సిసి రోడ్లు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం,200 ఉచిత యూనిట్ల కరెంటు 21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇందిరమ్మ చీరలు ప్రజాపాలనలో అందిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం. బిఆర్ఎస్ బిజెపి లు అక్రమ సంపాదనతో గెలవాలని చూస్తున్నారు. వారికి ఓటు వేస్తే మురికి కాల్వలో వేసినట్లే. జిల్లాలో బిఆర్ఎస్, బిజెపికి అభ్యర్థులు కరువు అయ్యారు. 2029లో తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రానున్నది. ముఖ్యమంత్రిగా రెండవసారి రేవంత్ రెడ్డి అవుతారు. ఈ కార్యక్రమంలో సామల భాస్కర్, పబ్బు రాజు గౌడ్, బడుగు లక్ష్మయ్య, చింతల వెంకటరెడ్డి, పాలకూర్ల స్వామి, గుర్రం పాండురంగ, గోశిక ప్రభాకర్, గోషిక రవి, రాపోలు రాజశేఖర్, నోముల మాధవరెడ్డి, గుజ్జరి శ్రవణ్ కుమార్, గంజి దేవదాస్,కర్నాటి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు..

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News