Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 10:05 PM

11వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి దండంపల్లి సుజాత సత్తయ్యను గెలిపించండి : దండంపల్లి సత్తయ్యను

11వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి దండంపల్లి సుజాత సత్తయ్యను గెలిపించండి : దండంపల్లి సత్తయ్యను

11వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి దండంపల్లి సుజాత సత్తయ్యను గెలిపించండి : దండంపల్లి సత్తయ్యను
February 04, 2026 05:51 AM 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

11వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి దండంపల్లి సుజాత సత్తయ్యను గెలిపించండి : దండంపల్లి సత్తయ్యను

   11వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీమతి దండంపల్లి సుజాత సత్తయ్య గారి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని సిపిఎం పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్యపిలుపునిచ్చారు. మంగళవారం 11వ డివిజన్ అర్బన్ కాలనీలో సుజాత -సత్తయ్య లకు మద్దతుగా భారీ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సీపీఎం పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. నల్గొండ పట్టణ అభివృద్ధికి ఆటంకంగా 565 జాతీయ రహదారి బైపాస్ రోడ్డు నిర్మాణం పట్టణ నడిమధ్య నుండి రావడం మధ్యతరగతి ప్రజలు తమ పిల్లల కోసం కొనుగోలు చేసుకున్న ప్లాట్లు పోవడం ద్వారా చాలా ఇబ్బందులకు గురి అయ్యారని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లను కాంగ్రెస్ అధికారులకు వచ్చి రెండు సంవత్సరాలు దాటిన పంపిణీ చేయకుండా లబ్ధిదారులను మానసికవేదనకు గురి చేశారని ఆరోపించారు. మాజీ కౌన్సిలర్ గా డివిజన్ పై అవగాహన కలిగిన సుజాత సత్తయ్య కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్ కార్పొరేటర్ ఎన్నికల నేపథ్యంలో శ్రీమతి దండంపల్లి సుజాత సత్తయ్య కారు గుర్తుకు మద్దతుగా ప్రచారం ఊపందుకుంది. సమయం, సేవాభావంతో ప్రజల మధ్య ఉంటూ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆమెకు స్థానికులు విశేషంగా మద్దతు తెలుపుతున్నారు. డివిజన్ అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజల ఆశీర్వాదాలతో ముందుకు సాగుతున్నామని అభ్యర్థి దండంపల్లి సుజాత సత్తయ్య పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో టిఆర్ఎస్ పట్టణ నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి, సిపిఎం పట్టణ కమిటీ సభ్యురాలు దండెంపల్లి సరోజ ,శాఖ కార్యదర్శి పనస చంద్రయ్య, పల్లె నగేష్ పగిళ్ల వెంకన్న పజూరి పరమేష్ ఇంద్రయ్య జగన్ దండంపల్లి మారయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News