Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:31 PM

11వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి దండంపల్లి సుజాత సత్తయ్యను గెలిపించండి : దండంపల్లి సత్తయ్యను

11వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి దండంపల్లి సుజాత సత్తయ్యను గెలిపించండి : దండంపల్లి సత్తయ్యను

11వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి దండంపల్లి సుజాత సత్తయ్యను గెలిపించండి : దండంపల్లి సత్తయ్యను
February 04, 2026 05:51 AM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

11వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి దండంపల్లి సుజాత సత్తయ్యను గెలిపించండి : దండంపల్లి సత్తయ్యను

   11వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీమతి దండంపల్లి సుజాత సత్తయ్య గారి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని సిపిఎం పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్యపిలుపునిచ్చారు. మంగళవారం 11వ డివిజన్ అర్బన్ కాలనీలో సుజాత -సత్తయ్య లకు మద్దతుగా భారీ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సీపీఎం పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. నల్గొండ పట్టణ అభివృద్ధికి ఆటంకంగా 565 జాతీయ రహదారి బైపాస్ రోడ్డు నిర్మాణం పట్టణ నడిమధ్య నుండి రావడం మధ్యతరగతి ప్రజలు తమ పిల్లల కోసం కొనుగోలు చేసుకున్న ప్లాట్లు పోవడం ద్వారా చాలా ఇబ్బందులకు గురి అయ్యారని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లను కాంగ్రెస్ అధికారులకు వచ్చి రెండు సంవత్సరాలు దాటిన పంపిణీ చేయకుండా లబ్ధిదారులను మానసికవేదనకు గురి చేశారని ఆరోపించారు. మాజీ కౌన్సిలర్ గా డివిజన్ పై అవగాహన కలిగిన సుజాత సత్తయ్య కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్ కార్పొరేటర్ ఎన్నికల నేపథ్యంలో శ్రీమతి దండంపల్లి సుజాత సత్తయ్య కారు గుర్తుకు మద్దతుగా ప్రచారం ఊపందుకుంది. సమయం, సేవాభావంతో ప్రజల మధ్య ఉంటూ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆమెకు స్థానికులు విశేషంగా మద్దతు తెలుపుతున్నారు. డివిజన్ అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజల ఆశీర్వాదాలతో ముందుకు సాగుతున్నామని అభ్యర్థి దండంపల్లి సుజాత సత్తయ్య పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో టిఆర్ఎస్ పట్టణ నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి, సిపిఎం పట్టణ కమిటీ సభ్యురాలు దండెంపల్లి సరోజ ,శాఖ కార్యదర్శి పనస చంద్రయ్య, పల్లె నగేష్ పగిళ్ల వెంకన్న పజూరి పరమేష్ ఇంద్రయ్య జగన్ దండంపల్లి మారయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News