Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:50 PM

10వ వార్డులో ఇంటింటి ప్రచారం జోరు

10వ వార్డులో ఇంటింటి ప్రచారం జోరు

10వ వార్డులో ఇంటింటి ప్రచారం జోరు
February 05, 2026 01:25 PM 298 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham


కారు గుర్తుకు ఓటు వేసి సదాశివ రెడ్డిని గెలిపించాలి

సూర్యాపేట:

సూర్యాపేట పట్టణంలోని పదవ వార్డు పరిధిలోని పిల్లలమర్రి గ్రామంలో ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశాల మేరకు ఇంటింటి ప్రచారం చేపట్టి, సదాశివ రెడ్డిని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట మాజీ జిల్లా పరిషత్ సభ్యుడు జీడి భిక్షం పాల్గొని గ్రామంలోని ప్రతి వీధి, ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజలతో మమేకమయ్యారు. గతంలో కారు గుర్తు ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. వార్డు అభివృద్ధికి సదాశివ రెడ్డి సరైన నాయకుడని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించే వ్యక్తిత్వం ఆయనదని తెలిపారు.గ్రామంలో తాగునీటి సమస్యలు, రహదారులు, పారిశుధ్యం, కాలనీల అభివృద్ధి, పేదల సంక్షేమం వంటి అంశాలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటూ, భవిష్యత్‌లో చేపట్టబోయే కార్యక్రమాలపై హామీ ఇచ్చారు. ప్రజల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ తోడుగా ఉండే నాయకత్వం అవసరమని, అలాంటి నాయకత్వాన్ని సదాశివ రెడ్డి అందిస్తారని జీడి భిక్షం పేర్కొన్నారు.పిల్లలమర్రి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా కారు గుర్తు పనిచేస్తుందని, గత అనుభవం, ప్రజలపై అవగాహన ఉన్న అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి సదాశివ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు.ఈ ఇంటింటి ప్రచారానికి స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనగా, గ్రామంలో ఎన్నికల వాతావరణం మరింత ఉత్సాహంగా మారింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News