సోమందేపల్లి:
ముస్లిం సోదరులు పవిత్రంగా భావించే రమజాన్ మాసపు 26వ ఉపవాస దీక్ష సోమందేపల్లిలో సోమవారం ప్రారంభమైంది. సోమందేపల్లి జామియా మజీద్లో తెల్లవారుజామున ముస్లిం సోదరులు 26వ ఉపవాస దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా ఫజర్ నమాజ్ అనంతరం మౌలానా మహమ్మద్ ఇలియాజ్ బోధనలు చేశారు. నేటి నుండి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతున్నందున ప్రతి విద్యార్థి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని దువా చేశారు. తమ జీవితంలోని తొలి ముఖ్యమైన పరీక్షలో విజయం సాధించి తల్లిదండ్రులు, పాఠశాలలు, గురువులు మరియు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ప్రార్థించారు.
అదే విధంగా పరీక్షలకు వెళ్లే విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా గ్రామ ప్రజలు వారికి వాహనాలలో లిఫ్ట్ ఇచ్చి సహాయం చేయాలని మౌలానా మహమ్మద్ ఇలియాజ్ పిలుపునిచ్చారు















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి