100 పడకల ఆసుపత్రి కోసం సిపిఎం నాయకుల వినతి – అసెంబ్లీలో ప్రస్తావిస్తామని ఎమ్మెల్యే, హామీ ఇచ్చిన మంత్రి
100 పడకల ఆసుపత్రి కోసం సిపిఎం నాయకుల వినతి – అసెంబ్లీలో ప్రస్తావిస్తామని ఎమ్మెల్యే, హామీ ఇచ్చిన మంత్రి
స్థానికం బృందం
ఎమ్మెల్యే వీరేశం ద్వారా మంత్రికి వినతి
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని వందల పడకల స్థాయికి పెంచాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్సీ చెరుకుపల్లి సీతారాములు ఆధ్వర్యంలో రామన్నపేట సిపిఎం నాయకులు వినతి పత్రం సమర్పించారు.
హైదరాబాద్లో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను క్యాంప్ కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఆసుపత్రి విస్తరణ అత్యవసరమని, పెరుగుతున్న రోగుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని100 పడకల సంఖ్యను పెంచాలని కోరారు.
ఈ అంశాన్ని ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో ప్రస్తావిస్తామని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. అనంతరం మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పందిస్తూ
అవసరమైన నిధులు కేటాయించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సిపిఎం నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జహంగీర్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేకు అశోక్ రెడ్డి వెల్లడించారు. 100 పడకల ఆసుపత్రి అభివృద్ధిపై స్పష్టమైన హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి