Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మత్తుకు దూరంగా ఉంటేనే దేశ భవిష్యత్తు భద్రం: ​డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎం. సుమన్‌ కల్యాణ్‌ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 27, 2026 01:00 PM

100 పడకల ఆసుపత్రి కోసం సిపిఎం నాయకుల వినతి – అసెంబ్లీలో ప్రస్తావిస్తామని ఎమ్మెల్యే, హామీ ఇచ్చిన మంత్రి

100 పడకల ఆసుపత్రి కోసం సిపిఎం నాయకుల వినతి – అసెంబ్లీలో ప్రస్తావిస్తామని ఎమ్మెల్యే, హామీ ఇచ్చిన మంత్రి

100 పడకల ఆసుపత్రి కోసం సిపిఎం నాయకుల వినతి – అసెంబ్లీలో ప్రస్తావిస్తామని ఎమ్మెల్యే, హామీ ఇచ్చిన మంత్రి
March 18, 2026 05:33 PM 257 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎమ్మెల్యే వీరేశం ద్వారా మంత్రికి వినతి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని వందల పడకల స్థాయికి పెంచాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్సీ చెరుకుపల్లి సీతారాములు ఆధ్వర్యంలో రామన్నపేట సిపిఎం నాయకులు వినతి పత్రం సమర్పించారు.

హైదరాబాద్‌లో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను క్యాంప్ కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఆసుపత్రి విస్తరణ అత్యవసరమని, పెరుగుతున్న రోగుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని100 పడకల సంఖ్యను పెంచాలని కోరారు.

ఈ అంశాన్ని ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో ప్రస్తావిస్తామని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. అనంతరం మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పందిస్తూ

అవసరమైన నిధులు కేటాయించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సిపిఎం నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జహంగీర్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేకు అశోక్ రెడ్డి వెల్లడించారు. 100 పడకల ఆసుపత్రి అభివృద్ధిపై స్పష్టమైన హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News