06వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థికి వేముల వీరేశం పిలుపు
06వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థికి వేముల వీరేశం పిలుపు
స్థానికం బృందం
చిట్యాలలో అభివృద్ధి హామీలతో కాంగ్రెస్ ప్రచారం
చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో 06వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి జెర్రీపోతుల సత్యనారాయణను చెయ్యి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రజలను కోరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో చిట్యాల మున్సిపాలిటీలో అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యం పాలైందని విమర్శించారు. మౌలిక సదుపాయాల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.06వ వార్డులో ఉన్న సీసీ రోడ్లు, డ్రెయినేజీ, విద్యుత్ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమని పేర్కొంటూ, ప్రజల ఆశీర్వాదంతో చిట్యాల మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి