యువ టీం ఆధ్వర్యంలో 610 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చేతి రాత పుస్తకాల పంపిణీ
యువ టీం ఆధ్వర్యంలో 610 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చేతి రాత పుస్తకాల పంపిణీ
Editor Desk
స్థానికం:భువనగిరి రిపోర్టర్ ఎన్.కుమార్
విద్యార్థుల్లో హ్యాండ్ రైటింగ్ మెరుగుపర్చాలన్న లక్ష్యంతో భువనగిరి పట్టణంలోని 9 ప్రభుత్వ ఉన్నత,ప్రాథమిక పాఠశాలల్లో 4వ తరగతి నుండి 7వ తరగతి చుదువుతున్న 610 మంది విద్యార్థులకు యువ టీం ఆధ్వర్యంలో చేతి రాత పుస్తకాలు అందచేయడం జరిగింది.జూనియర్ కాలేజీ ఆవరణలో గల ప్రభుత్వ హై స్కూల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి (ఏంఈఓ) పాల్వయి నాగవర్ధన్ రెడ్డి, యువ టీం కన్వీనర్ సూదగాని రాజు చేతుల మీదుగా విద్యార్థులకు ఆంగ్ల చేతి రాత పుస్తకాలు అందచేశారు. ఈ సందర్భంగా ఏంఈఓ మాట్లాడుతూ... విద్యార్థుల హ్యాండ్ రైటింగ్ మెరుగు పరచడం కోసం యువ టీం అందిస్తున్న పుస్తకాలు చాలా ఉపయోగపడ్తాయని, విద్యార్థులు ప్రతి రోజు ప్రాక్టీస్ చేసి హ్యాండ్ రైటింగ్ మెరుగు పర్చుకోవాలని కోరారు. యువ టీం కన్వీనర్ సూదగాని రాజు మాట్లాడుతూ...విద్యార్థులకు విషయ పరిజ్ఞానంతో పాటుగా హ్యాండ్ రైటింగ్ ఎంతో ముఖ్యం అని,చక్కని చేతి రాత తో మన పరిజ్ఞానాన్ని చక్కగా వివరించొచ్చు అని తెలిపారు.యువ టీం అందిస్తున్న చేతి రాత పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలని,ఉపాధ్యాయులు కూడా ప్రతి రోజు విద్యార్థుల చేతి రాతని పర్యవేక్షించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల ఉపాధ్యాయులు,యువ టీం సభ్యులు పోత్నక్ సన్నీ,కుసుమ సాయితేజ,చిన్నగారి నితీష్,జంగిటి వరుణ్,దాస మణి,ముదిగొండ శివ,కాసు రామకృష్ణ రాజు,బయ్యాన్ యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి