Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 01:08 AM

యూరియా బస్తాపై రూ.30 అదనపు వసూలు?

యూరియా బస్తాపై రూ.30 అదనపు వసూలు?

యూరియా బస్తాపై రూ.30 అదనపు వసూలు?
19-02-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేటలో డీలర్ల దందాపై రైతుల ఆగ్రహం

ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట చిల్లర ధర (ఎంఆర్పీ)కు విరుద్ధంగా యూరియా బస్తాలపై అదనపు వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని పలువురు ఎరువుల డీలర్లు ఒక్కో యూరియా బస్తాపై రూ.30 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు.

అదనపు మొత్తంపై ప్రశ్నిస్తే రవాణా, హమాలీ చార్జీలు పేరుతో డబ్బులు తీసుకుంటున్నారని వారు చెబుతున్నారు. ఎంఆర్పీ కంటే ఎక్కువ ఇవ్వకపోతే యూరియా అందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆన్‌లైన్ విక్రయ వ్యవస్థ అమల్లో ఉన్నప్పటికీ ఈ విధమైన వసూళ్లు కొనసాగడంపై రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సాగు సీజన్‌లో ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తమపై ఇది అదనపు భారం అవుతోందని వాపోతున్నారు.

ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని, వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. యూరియాను కేవలం ఎంఆర్పీ ధరకే విక్రయించేలా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Sthanikam

యూరియా బస్తాపై రూ.30 అదనపు వసూలు?

Article Image

రామన్నపేటలో డీలర్ల దందాపై రైతుల ఆగ్రహం

ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట చిల్లర ధర (ఎంఆర్పీ)కు విరుద్ధంగా యూరియా బస్తాలపై అదనపు వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని పలువురు ఎరువుల డీలర్లు ఒక్కో యూరియా బస్తాపై రూ.30 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు.

అదనపు మొత్తంపై ప్రశ్నిస్తే రవాణా, హమాలీ చార్జీలు పేరుతో డబ్బులు తీసుకుంటున్నారని వారు చెబుతున్నారు. ఎంఆర్పీ కంటే ఎక్కువ ఇవ్వకపోతే యూరియా అందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆన్‌లైన్ విక్రయ వ్యవస్థ అమల్లో ఉన్నప్పటికీ ఈ విధమైన వసూళ్లు కొనసాగడంపై రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సాగు సీజన్‌లో ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తమపై ఇది అదనపు భారం అవుతోందని వాపోతున్నారు.

ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని, వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. యూరియాను కేవలం ఎంఆర్పీ ధరకే విక్రయించేలా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News