యూరియా బస్తాపై రూ.30 అదనపు వసూలు?
యూరియా బస్తాపై రూ.30 అదనపు వసూలు?
Editor Desk
రామన్నపేటలో డీలర్ల దందాపై రైతుల ఆగ్రహం
ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట చిల్లర ధర (ఎంఆర్పీ)కు విరుద్ధంగా యూరియా బస్తాలపై అదనపు వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని పలువురు ఎరువుల డీలర్లు ఒక్కో యూరియా బస్తాపై రూ.30 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు.
అదనపు మొత్తంపై ప్రశ్నిస్తే రవాణా, హమాలీ చార్జీలు పేరుతో డబ్బులు తీసుకుంటున్నారని వారు చెబుతున్నారు. ఎంఆర్పీ కంటే ఎక్కువ ఇవ్వకపోతే యూరియా అందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆన్లైన్ విక్రయ వ్యవస్థ అమల్లో ఉన్నప్పటికీ ఈ విధమైన వసూళ్లు కొనసాగడంపై రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సాగు సీజన్లో ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తమపై ఇది అదనపు భారం అవుతోందని వాపోతున్నారు.
ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని, వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. యూరియాను కేవలం ఎంఆర్పీ ధరకే విక్రయించేలా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి