PRINT TIME: February 23, 2026 10:07 PM
ఓట్లు కొనలేం.. మందు తాపలేం
ఓట్లు కొనలేం.. మందు తాపలేం
December 11, 2025 05:59 AM
81 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
నిజాయితీగా ఓటేయండి
డోంట్ డిస్టర్బ్ అంటూ సర్పంచ్ అభ్యర్థి ఇంటి ఎదుట బోర్డు
స్థానిక ప్రతినిధి భిక్కనూరు '
మందు తాపలేం... పైసలు పంచలేం.. డోంట్ డిస్టర్బ్' అంటూ సర్పంచ్ అభ్యర్థి ఇంటి ముందు బోర్డు ఏర్పాటు చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో సంచలనంగా మారింది. భిక్కనూరు పట్టణ సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తున్న ఓ అభ్యర్థిని తన ఇంటి ముందు బోర్డుపై ఓట్లను కొనలేమని... నిజాయితీగా ఆలోచించి తనకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. నిన్న మొన్నటి వరకు పట్టణంలో ఉధృతంగా ప్రచారం చేసిన ఆమె ఇంటికి ఇవాళ పలువురు వచ్చి వెళ్తూ, డోర్ కొడుతూ.... పైసలు, మందు పంపకాలు లేవా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో విసుగుచెందిన ఆమె ఇంటి ముందు ఈ విధంగా బోర్డును ఏర్పాటు చేయడం వైరల్ గా మారింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి