PRINT TIME: February 24, 2026 09:02 AM
యవ్వనంలో విడిపోయిన ప్రేమికులు 65ఏళ్ల వయసులో ఒక్కటయ్యారు
యవ్వనంలో విడిపోయిన ప్రేమికులు 65ఏళ్ల వయసులో ఒక్కటయ్యారు
January 15, 2026 05:08 PM
26 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
కేరళ స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి కేరళలోని ముందక్కల్కు చెందిన జయప్రకాష్, రష్మి యుక్త వయస్సులో ఉన్నప్పుడు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది.అయితే తమ ప్రేమ గురించి పెద్దవాళ్లకు చెప్పడానికి భయపడ్డారు. దీంతో రష్మికి తల్లిదండ్రులు వేరే వ్యక్తితో పెళ్లి చేసేశారు.జయప్రకాష్ ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లిపోయాడు.ఆ తర్వాత జయప్రకాష్ కూడా పెళ్లి చేసుకుని స్థిరపడిపోయాడు. ఇద్దరికీ పిల్లలు ఉన్నారు.పదేళ్ల క్రితం రష్మి భర్త చనిపోయాడు. జయప్రకాష్ ఐదేళ్ల క్రితం భార్యను కోల్పోయాడు. రష్మిని ఓ షార్ట్ ఫిల్మ్ లో చూసిన జయప్రకాష్ ఆమెను సంప్రదించాడు. వారి ఇద్దరి పిల్లలు పెద్ద మనసుతో ఆలోచించి వారిని ఒక్కటి చేశారు. స్వచ్ఛమైన ప్రేమ ఆలస్యమైనా ఎప్పుడో ఒకప్పుడు గమ్యాన్ని చేరుకుంటుందని వారు నిరూపించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి