Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపాలిటీలో ‘చేయూత’ పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 05:36 AM

యాప్ విధానం రద్దు చేసి సహకార సంఘాల ద్వారానే సరఫరా చేయాలి: సిపిఐ నేత ఎర్ర రమేష్ గౌడ్

యాప్ విధానం రద్దు చేసి సహకార సంఘాల ద్వారానే సరఫరా చేయాలి: సిపిఐ నేత ఎర్ర రమేష్ గౌడ్

యాప్ విధానం రద్దు చేసి సహకార సంఘాల ద్వారానే సరఫరా చేయాలి: సిపిఐ నేత ఎర్ర రమేష్ గౌడ్
21-02-2026 107 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేటలో కల్తీ యూరియాపై ఆగ్రహం

రామన్నపేటలో ప్రైవేట్ ఏజెన్సీ షాపులలో కల్తీ యూరియా అమ్మకాలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం యాప్ ద్వారా యూరియాను బుక్ చేసుకోవాలనే నిబంధన విధించడం వల్ల రైతులకు ఎరువు సకాలంలో అందడం లేదని సిపిఐ జిల్లా నాయకులు ఎర్ర రమేష్ గౌడ్ విమర్శించారు.

యాప్‌లో బుక్ చేసిన యూరియాను ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా తీసుకోవాల్సి రావడంతో, అక్కడ ఏ రకమైన యూరియా అమ్ముతున్నారో రైతులకు స్పష్టత లేకపోతోందని తెలిపారు. పంటలకు యూరియా వేయాల్సిన కీలక సమయంలో ఆలస్యం కావడంతో, ఎక్కడ దొరికితే అక్కడ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని, యాప్ విధానాన్ని పునర్విమర్శించి, యూరియాను వ్యవసాయ సహకార సంఘాల ద్వారానే నేరుగా రైతులకు అందించాలని ఎర్ర రమేష్ డిమాండ్ చేశారు. అలాగే యూరియా సరఫరా చేసే ప్రైవేట్ ఏజెన్సీలపై నిరంతరం తనిఖీలు నిర్వహించి, కల్తీ ఎరువుల అమ్మకాలను కట్టడి చేయాలని కోరారు.

Sthanikam

యాప్ విధానం రద్దు చేసి సహకార సంఘాల ద్వారానే సరఫరా చేయాలి: సిపిఐ నేత ఎర్ర రమేష్ గౌడ్

Article Image

రామన్నపేటలో కల్తీ యూరియాపై ఆగ్రహం

రామన్నపేటలో ప్రైవేట్ ఏజెన్సీ షాపులలో కల్తీ యూరియా అమ్మకాలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం యాప్ ద్వారా యూరియాను బుక్ చేసుకోవాలనే నిబంధన విధించడం వల్ల రైతులకు ఎరువు సకాలంలో అందడం లేదని సిపిఐ జిల్లా నాయకులు ఎర్ర రమేష్ గౌడ్ విమర్శించారు.

యాప్‌లో బుక్ చేసిన యూరియాను ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా తీసుకోవాల్సి రావడంతో, అక్కడ ఏ రకమైన యూరియా అమ్ముతున్నారో రైతులకు స్పష్టత లేకపోతోందని తెలిపారు. పంటలకు యూరియా వేయాల్సిన కీలక సమయంలో ఆలస్యం కావడంతో, ఎక్కడ దొరికితే అక్కడ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని, యాప్ విధానాన్ని పునర్విమర్శించి, యూరియాను వ్యవసాయ సహకార సంఘాల ద్వారానే నేరుగా రైతులకు అందించాలని ఎర్ర రమేష్ డిమాండ్ చేశారు. అలాగే యూరియా సరఫరా చేసే ప్రైవేట్ ఏజెన్సీలపై నిరంతరం తనిఖీలు నిర్వహించి, కల్తీ ఎరువుల అమ్మకాలను కట్టడి చేయాలని కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News