యాప్ విధానం రద్దు చేసి సహకార సంఘాల ద్వారానే సరఫరా చేయాలి: సిపిఐ నేత ఎర్ర రమేష్ గౌడ్
యాప్ విధానం రద్దు చేసి సహకార సంఘాల ద్వారానే సరఫరా చేయాలి: సిపిఐ నేత ఎర్ర రమేష్ గౌడ్
Editor Desk
రామన్నపేటలో కల్తీ యూరియాపై ఆగ్రహం
రామన్నపేటలో ప్రైవేట్ ఏజెన్సీ షాపులలో కల్తీ యూరియా అమ్మకాలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం యాప్ ద్వారా యూరియాను బుక్ చేసుకోవాలనే నిబంధన విధించడం వల్ల రైతులకు ఎరువు సకాలంలో అందడం లేదని సిపిఐ జిల్లా నాయకులు ఎర్ర రమేష్ గౌడ్ విమర్శించారు.
యాప్లో బుక్ చేసిన యూరియాను ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా తీసుకోవాల్సి రావడంతో, అక్కడ ఏ రకమైన యూరియా అమ్ముతున్నారో రైతులకు స్పష్టత లేకపోతోందని తెలిపారు. పంటలకు యూరియా వేయాల్సిన కీలక సమయంలో ఆలస్యం కావడంతో, ఎక్కడ దొరికితే అక్కడ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని, యాప్ విధానాన్ని పునర్విమర్శించి, యూరియాను వ్యవసాయ సహకార సంఘాల ద్వారానే నేరుగా రైతులకు అందించాలని ఎర్ర రమేష్ డిమాండ్ చేశారు. అలాగే యూరియా సరఫరా చేసే ప్రైవేట్ ఏజెన్సీలపై నిరంతరం తనిఖీలు నిర్వహించి, కల్తీ ఎరువుల అమ్మకాలను కట్టడి చేయాలని కోరారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి