Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:42 AM

యాప్ విధానం రద్దు చేసి సహకార సంఘాల ద్వారానే సరఫరా చేయాలి: సిపిఐ నేత ఎర్ర రమేష్ గౌడ్

యాప్ విధానం రద్దు చేసి సహకార సంఘాల ద్వారానే సరఫరా చేయాలి: సిపిఐ నేత ఎర్ర రమేష్ గౌడ్

యాప్ విధానం రద్దు చేసి సహకార సంఘాల ద్వారానే సరఫరా చేయాలి: సిపిఐ నేత ఎర్ర రమేష్ గౌడ్
February 21, 2026 01:24 PM 93 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేటలో కల్తీ యూరియాపై ఆగ్రహం

రామన్నపేటలో ప్రైవేట్ ఏజెన్సీ షాపులలో కల్తీ యూరియా అమ్మకాలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం యాప్ ద్వారా యూరియాను బుక్ చేసుకోవాలనే నిబంధన విధించడం వల్ల రైతులకు ఎరువు సకాలంలో అందడం లేదని సిపిఐ జిల్లా నాయకులు ఎర్ర రమేష్ గౌడ్ విమర్శించారు.

యాప్‌లో బుక్ చేసిన యూరియాను ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా తీసుకోవాల్సి రావడంతో, అక్కడ ఏ రకమైన యూరియా అమ్ముతున్నారో రైతులకు స్పష్టత లేకపోతోందని తెలిపారు. పంటలకు యూరియా వేయాల్సిన కీలక సమయంలో ఆలస్యం కావడంతో, ఎక్కడ దొరికితే అక్కడ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని, యాప్ విధానాన్ని పునర్విమర్శించి, యూరియాను వ్యవసాయ సహకార సంఘాల ద్వారానే నేరుగా రైతులకు అందించాలని ఎర్ర రమేష్ డిమాండ్ చేశారు. అలాగే యూరియా సరఫరా చేసే ప్రైవేట్ ఏజెన్సీలపై నిరంతరం తనిఖీలు నిర్వహించి, కల్తీ ఎరువుల అమ్మకాలను కట్టడి చేయాలని కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News