Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:31 PM

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎన్నికల సందర్భంగా మద్యం దుకాణాల మూసివేత.

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎన్నికల సందర్భంగా మద్యం దుకాణాల మూసివేత.

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎన్నికల సందర్భంగా మద్యం దుకాణాల మూసివేత.
08-02-2026 176 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణ సమయంలో శాంతి భద్రతలు పరిరక్షించడంతో పాటు స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించేందుకు మద్యం దుకాణాల మూసివేతకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది.నోటిఫికేషన్ ప్రకారం ఫిబ్రవరి 9వ తేదీ సాయంత్రం ఐదు గంటల నుంచి ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ పూర్తయ్యే వరకు భువనగిరి, పోచంపల్లి, చౌటుప్పల్, ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూరు మున్సిపాలిటీల పరిధిలోని అన్ని మద్యం దుకాణాలు పూర్తిగా మూసివేయనున్నారు.అదేవిధంగా ఫిబ్రవరి 13వ తేదీ ఎన్నికల ఫలితాల రోజు, కౌంటింగ్ పూర్తయ్యే వరకు భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని మద్యం దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు, కల్లు డిపోలు పూర్తిగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎక్సైజ్ అధికారి ఎం. విష్ణుమూర్తి హెచ్చరించారు. ఎన్నికల ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు ప్రజలు, వ్యాపారులు సహకరించాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.

Sthanikam

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎన్నికల సందర్భంగా మద్యం దుకాణాల మూసివేత.

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణ సమయంలో శాంతి భద్రతలు పరిరక్షించడంతో పాటు స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించేందుకు మద్యం దుకాణాల మూసివేతకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది.నోటిఫికేషన్ ప్రకారం ఫిబ్రవరి 9వ తేదీ సాయంత్రం ఐదు గంటల నుంచి ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ పూర్తయ్యే వరకు భువనగిరి, పోచంపల్లి, చౌటుప్పల్, ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూరు మున్సిపాలిటీల పరిధిలోని అన్ని మద్యం దుకాణాలు పూర్తిగా మూసివేయనున్నారు.అదేవిధంగా ఫిబ్రవరి 13వ తేదీ ఎన్నికల ఫలితాల రోజు, కౌంటింగ్ పూర్తయ్యే వరకు భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని మద్యం దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు, కల్లు డిపోలు పూర్తిగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎక్సైజ్ అధికారి ఎం. విష్ణుమూర్తి హెచ్చరించారు. ఎన్నికల ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు ప్రజలు, వ్యాపారులు సహకరించాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News