Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 11:51 PM

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎన్నికల సందర్భంగా మద్యం దుకాణాల మూసివేత.

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎన్నికల సందర్భంగా మద్యం దుకాణాల మూసివేత.

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎన్నికల సందర్భంగా మద్యం దుకాణాల మూసివేత.
February 08, 2026 04:09 PM 163 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణ సమయంలో శాంతి భద్రతలు పరిరక్షించడంతో పాటు స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించేందుకు మద్యం దుకాణాల మూసివేతకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది.నోటిఫికేషన్ ప్రకారం ఫిబ్రవరి 9వ తేదీ సాయంత్రం ఐదు గంటల నుంచి ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ పూర్తయ్యే వరకు భువనగిరి, పోచంపల్లి, చౌటుప్పల్, ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూరు మున్సిపాలిటీల పరిధిలోని అన్ని మద్యం దుకాణాలు పూర్తిగా మూసివేయనున్నారు.అదేవిధంగా ఫిబ్రవరి 13వ తేదీ ఎన్నికల ఫలితాల రోజు, కౌంటింగ్ పూర్తయ్యే వరకు భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని మద్యం దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు, కల్లు డిపోలు పూర్తిగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎక్సైజ్ అధికారి ఎం. విష్ణుమూర్తి హెచ్చరించారు. ఎన్నికల ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు ప్రజలు, వ్యాపారులు సహకరించాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News