Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 02:57 PM

యాదాద్రి భువనగిరి జిల్లాకు కొత్త కలెక్టర్‌గా అనురాగ్ జయంతి నియామకం

యాదాద్రి భువనగిరి జిల్లాకు కొత్త కలెక్టర్‌గా అనురాగ్ జయంతి నియామకం

యాదాద్రి భువనగిరి జిల్లాకు కొత్త కలెక్టర్‌గా అనురాగ్ జయంతి నియామకం
26-02-2026 251 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

2015 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అనురాగ్ జయంతి గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కలెక్టర్‌గా పదవి బాధ్యతలు స్వీకరించారు.

ఇంతకుముందు ఆయన భోధన్, ఖమ్మం జిల్లాల్లో సబ్ కలెక్టర్‌గా పనిచేసి పరిపాలనలో అనుభవాన్ని సంపాదించారు. అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా సేవలందించారు.

తదుపరి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌గా పనిచేసిన ఆయన, ప్రస్తుతం రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తుండగా బదిలీపై యాదాద్రి భువనగిరి జిల్లాకు నియమితులయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఫలాలు అట్టడుగు వర్గాలకు చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమగ్ర అభివృద్ధి దిశగా జిల్లా ముందుకు సాగేందుకు ప్రజలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.


Sthanikam

యాదాద్రి భువనగిరి జిల్లాకు కొత్త కలెక్టర్‌గా అనురాగ్ జయంతి నియామకం

Article Image

2015 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అనురాగ్ జయంతి గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కలెక్టర్‌గా పదవి బాధ్యతలు స్వీకరించారు.

ఇంతకుముందు ఆయన భోధన్, ఖమ్మం జిల్లాల్లో సబ్ కలెక్టర్‌గా పనిచేసి పరిపాలనలో అనుభవాన్ని సంపాదించారు. అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా సేవలందించారు.

తదుపరి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌గా పనిచేసిన ఆయన, ప్రస్తుతం రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తుండగా బదిలీపై యాదాద్రి భువనగిరి జిల్లాకు నియమితులయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఫలాలు అట్టడుగు వర్గాలకు చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమగ్ర అభివృద్ధి దిశగా జిల్లా ముందుకు సాగేందుకు ప్రజలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News