Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:36 AM

వృద్ధుల గౌరవానికి పెన్షన్‌నే భరోసా – రాపోలు నిర్మలానరసింహా

వృద్ధుల గౌరవానికి పెన్షన్‌నే భరోసా – రాపోలు నిర్మలానరసింహా

వృద్ధుల గౌరవానికి పెన్షన్‌నే భరోసా – రాపోలు నిర్మలానరసింహా
January 13, 2026 09:23 AM 171 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులు తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఫిర్యాదు ఆధారంగా వారి జీతంలో 10–15 శాతం కట్ చేసి నేరుగా తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసేలా చట్టం చేస్తామని ప్రకటించిన విషయంపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ రాపోలు నిర్మలానరసింహా స్పందించారు.తల్లిదండ్రులు తమ పిల్లలపై ఫిర్యాదు చేయడం చాలా అరుదని, అది వారి గొప్పతనానికి నిదర్శనమని అన్నారు. ఫిర్యాదు చేస్తే కుటుంబ కలహాలు, అనవసర సమస్యలు తలెత్తుతాయనే భయంతో చాలామంది వృద్ధులు మౌనంగా మానసిక వేదన అనుభవిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు నిరాదరణకు గురవుతున్న వాస్తవాన్ని విస్మరించలేమన్నారు. అందరూ అలా చేస్తున్నారని అనడం లేదని, కానీ కొంతమంది వృద్ధులు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్నది నిజమన్నారు.ఈ నేపథ్యంలో ఫిర్యాదు చేసినా చేయకపోయినా తల్లిదండ్రుల ఖాతాల్లో కొంత మొత్తాన్ని జమ చేసేలా చట్టం చేయాలని, లేకపోతే ఎలాంటి షరతులు లేకుండా వయసును ప్రామాణికంగా తీసుకొని, ఉద్యోగాలు లేదా భూములు ఉన్నాయా లేవా అన్న తేడా లేకుండా అప్లై చేసుకున్న ప్రతి వృద్ధుడికి వృద్ధాప్య పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు. 60 ఏళ్ల వరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభుత్వాలకు పన్నులు చెల్లించిన వృద్ధులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన గౌరవమే పెన్షన్ అని పేర్కొన్నారు. పెన్షన్ వస్తే వృద్ధులు ఆత్మాభిమానంతో, మానసిక ప్రశాంతతతో జీవిస్తారని అన్నారు.

న్యాయశాస్త్ర సూత్రాన్ని ఉదహరిస్తూ, వందమంది దోషులు తప్పించుకున్నా ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదన్నట్లే తెలంగాణలో ఒక్క వృద్ధుడు కూడా కన్నీరు పెట్టుకోకుండా ఉండేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద మనసుతో ఆలోచించి వృద్ధులందరికీ పెన్షన్ ఇచ్చే నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News