Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:04 AM

విశ్వకర్మ కుటుంబాలకు న్యాయం చేయాలి

విశ్వకర్మ కుటుంబాలకు న్యాయం చేయాలి

విశ్వకర్మ కుటుంబాలకు న్యాయం చేయాలి
29-05-2026 84 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మున్సిపల్ చైర్‌పర్సన్‌కు వినతిపత్రం అందజేసిన గుడి నిర్మాణ కమిటీ

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని పాత ఫర్నిచర్ షాపుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విశ్వకర్మ కుటుంబాలకు తక్షణమే న్యాయం చేయాలని శ్రీ గోవిందమ్మ సమేత పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గుడి నిర్మాణ కమిటీ ప్రధాన కార్యదర్శి నాగవాచారి డిమాండ్ చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్‌గౌడ్ కు వినతిపత్రాన్ని అందజేశారు.​ఈ సందర్భంగా నాగవాచారి మాట్లాడుతూ.. నేటి ఆధునిక ప్రపంచంలో చేతివృత్తులు రోజురోజుకూ కనుమరుగైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ తమ కులవృత్తిని కాపాడుకోవడానికి విశ్వకర్మలు ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. వారి శ్రమను, ఆరాటాన్ని ప్రజాప్రతినిధులు, మేధావులు, కుల పెద్దలు గుర్తించి, ప్రతి ఒక్కరూ వారికి సహాయ సహకారాలు అందించాలని కోరారు.​"పాత ఫర్నిచర్ షాపుల తాకిడి వల్ల స్థానిక మనుమయ కుటుంబాల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. వారి జీవనోపాధి దెబ్బతింటోంది. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ మేల్కొని విశ్వకర్మల హక్కుల కోసం జరిగే ఈ పోరాటంలో భాగస్వాములు కావాలి."​ఈ కార్యక్రమంలో దేవరకొండ బాబు చారి పాల్గొని తమ మద్దతును తెలియజేశారు.

Sthanikam

విశ్వకర్మ కుటుంబాలకు న్యాయం చేయాలి

Article Image

మున్సిపల్ చైర్‌పర్సన్‌కు వినతిపత్రం అందజేసిన గుడి నిర్మాణ కమిటీ

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని పాత ఫర్నిచర్ షాపుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విశ్వకర్మ కుటుంబాలకు తక్షణమే న్యాయం చేయాలని శ్రీ గోవిందమ్మ సమేత పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గుడి నిర్మాణ కమిటీ ప్రధాన కార్యదర్శి నాగవాచారి డిమాండ్ చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్‌గౌడ్ కు వినతిపత్రాన్ని అందజేశారు.​ఈ సందర్భంగా నాగవాచారి మాట్లాడుతూ.. నేటి ఆధునిక ప్రపంచంలో చేతివృత్తులు రోజురోజుకూ కనుమరుగైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ తమ కులవృత్తిని కాపాడుకోవడానికి విశ్వకర్మలు ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. వారి శ్రమను, ఆరాటాన్ని ప్రజాప్రతినిధులు, మేధావులు, కుల పెద్దలు గుర్తించి, ప్రతి ఒక్కరూ వారికి సహాయ సహకారాలు అందించాలని కోరారు.​"పాత ఫర్నిచర్ షాపుల తాకిడి వల్ల స్థానిక మనుమయ కుటుంబాల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. వారి జీవనోపాధి దెబ్బతింటోంది. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ మేల్కొని విశ్వకర్మల హక్కుల కోసం జరిగే ఈ పోరాటంలో భాగస్వాములు కావాలి."​ఈ కార్యక్రమంలో దేవరకొండ బాబు చారి పాల్గొని తమ మద్దతును తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News