Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెండింగ్ కూలి డబ్బులు వెంటనే చెల్లించాలి – 23న ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా ఉద్యోగుల డిమాండ్లు vs ప్రభుత్వ గడువు – మధ్యలో ఇరుక్కున్న ప్రజలు 131వ సవరణ: ప్రజాస్వామ్య బలోపేతమా? లేక కొత్త సవాళ్ల ఆరంభమా? ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 22, 2026 07:08 AM

వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్‌లో రూ.40 వేల డీల్ – బెయిల్‌కు రేటు ఫిక్స్!

వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్‌లో రూ.40 వేల డీల్ – బెయిల్‌కు రేటు ఫిక్స్!

వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్‌లో రూ.40 వేల డీల్ – బెయిల్‌కు రేటు ఫిక్స్!
April 22, 2026 05:07 AM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

వికారాబాద్ జిల్లాలోని ఉమెన్స్ పోలీస్ స్టేషన్‌లో అవినీతి ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ వివాదం నేపథ్యంలో నమోదు చేసిన కేసులో స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి లంచం డిమాండ్ చేసిన సీఐ, ఎస్ఐ అధికారులు పట్టుబడడం కలకలం రేపింది.

వివరాల ప్రకారం, ఇర్షాద్ అనే వ్యక్తిపై మరియు అతని కుటుంబ సభ్యులపై Section 498A IPC కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో కుటుంబ సభ్యులకు స్టేషన్ బెయిల్ మంజూరు చేయడానికి సంబంధిత మహిళా పోలీస్ అధికారులు ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున మొత్తం రూ.60,000 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. తర్వాత చర్చల అనంతరం రూ.40,000కి ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది. బాధితుడు ముందుగా రూ.20,000 నగదును సీఐ, ఎస్ఐలకు అందజేశాడు. అయితే మిగిలిన మొత్తాన్ని ఇవ్వాల్సి ఉండగా, అవినీతిపై విసుగు చెందిన ఇర్షాద్ సంబంధిత అధికారులకు సమాచారం అందించాడు.

ఈ సమాచారంతో రంగంలోకి దిగిన అవినీతి నిరోధక అధికారులు పక్కా ప్రణాళికతో ట్రాప్ ఏర్పాటు చేశారు. మిగిలిన రూ.20,000 లంచం తీసుకునే సమయంలో సీఐ సరోజ, ఎస్ఐ రాణి సహా మరికొంతమందిని ఆధారాలతో కలిసి పట్టుకున్నారు. నగదు స్వాధీనం చేసుకుని, సంబంధిత అధికారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో పోలీస్ వ్యవస్థలోని అవినీతి మరోసారి బయటపడింది. ప్రజలకు న్యాయం చేయాల్సిన అధికారులు లంచాలకు పాల్పడడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. బాధితుల సమస్యలను పరిష్కరించాల్సిన చోటే ఇలాంటి అక్రమాలు జరగడం ఆందోళనకరమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో మరెవరైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటన పోలీస్ వ్యవస్థలో పారదర్శకత అవసరాన్ని మరోసారి గుర్తు చేసింది. అవినీతి నిరోధక చర్యలు మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News