వికలాంగులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకొని ముందుకు సాగాలి చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి
వికలాంగులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకొని ముందుకు సాగాలి చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి
స్థానికం బృందం
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో ఎన్ పి ఆర్ డి తెలంగాణ రాష్ట్ర కమిటీ ముద్రించిన 2026 సంవత్సరపు క్యాలెండర్ను చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వికలాంగులందరూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకొని సామాజికంగా, ఆర్థికంగా ముందుకు సాగాలని అన్నారు. వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.వికలాంగుల హక్కుల సాధన కోసం ఎన్ పి ఆర్ డి చేస్తున్న కృషిని అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలు వికలాంగుల్లో అవగాహన పెంపొందించడంలో కీలకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్, మండల అధ్యక్షులు సంజీవ శంకర్, దుర్కా ఐలయ్య, వనం శీను, పోతగల యాదమ్మ, నర్సిరెడ్డి, అంకం హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి