వికలాంగులు ప్రభుత్వ పథకాలు వినియోగించి ముందుకు సాగాలి – ఎమ్మెల్యే విప్ బిర్లా ఐలయ్య
వికలాంగులు ప్రభుత్వ పథకాలు వినియోగించి ముందుకు సాగాలి – ఎమ్మెల్యే విప్ బిర్లా ఐలయ్య
స్థానికం బృందం
యాదగిరిగుట్ట, స్థానికం ప్రధాన ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల కేంద్రంలో వికలాంగుల హక్కుల సాధన వేదిక (ఎన్పీఆర్డీ) తెలంగాణ రాష్ట్ర కమిటీ ముద్రించిన 2026 సంవత్సరపు క్యాలెండర్ను ఎమ్మెల్యే విప్ బిర్లా ఐలయ్య ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఉన్న వికలాంగులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను పూర్తిగా వినియోగించుకుని ఆర్థిక-సామాజికంగా ముందుకుసాగాలనిపిలుపునిచ్చారు.వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అలాగే వికలాంగుల హక్కుల సాధన కోసం ఎన్పీఆర్డీ చేపడుతున్న ఉద్యమాత్మక కార్యక్రమాలను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఎన్పీఆర్డీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్, జిల్లా కోశాధికారి కొత్త లలిత, జిల్లా నాయకులు పాల విజయకుమార్, జాంగిర్ రాజు, హరి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి