వికలాంగులకు రూ.6000 పెన్షన్ హామీ అమలు చేయాలి
వికలాంగులకు రూ.6000 పెన్షన్ హామీ అమలు చేయాలి
స్థానికం బృందం
రిజర్వేషన్లు కల్పించాలి – బడ్జెట్లో 5% నిధులు కేటాయించాలి
ఎన్పి ఆర్ డి 16వ ఆవిర్భావ దినోత్సవంలో వక్తల డిమాండ్
రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన రూ.6000 పెన్షన్ హామీని తక్షణమే అమలు చేయాలని, స్థానిక సంస్థలు మరియు నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఎన్పి ఆర్ డి నాయకులు డిమాండ్ చేశారు. హక్కుల సాధన కోసం పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
సంఘం కార్యాలయం వద్ద నిర్వహించిన ఎన్పి ఆర్ డి 16వ ఆవిర్భావ దినోత్సవ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కె. వెంకట్ జెండా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2010 ఫిబ్రవరి 21-22 తేదీలలో Kolkata నగరంలో ఎన్పి ఆర్ డి స్థాపించబడిందని తెలిపారు. “జాలి కాదు – మా హక్కులు మాకు కావాలి” అన్న నినాదంతో దేశవ్యాప్తంగా వికలాంగులను ఐక్యం చేస్తూ హక్కుల సాధన కోసం పోరాటాలు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.
2016 వికలాంగుల హక్కుల చట్టం సాధన, అంత్యోదయ రేషన్ కార్డులు, రైల్వే సౌకర్యాల విస్తరణ, ప్రజా ప్రదేశాలను అవరోధ రహితంగా మార్చడం వంటి అంశాల్లో సంఘం కృషి ఫలితంగా పురోగతి సాధించిందన్నారు. మహిళా వికలాంగుల హక్కుల పరిరక్షణలో కూడా సంఘం ముందుండి పోరాటాలు నిర్వహించిందని చెప్పారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీల అమలులో విఫలమయ్యాయని విమర్శించారు. బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి కనీసం 5 శాతం నిధులు కేటాయించాలని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, ప్రైవేట్ రంగంలో 5 శాతం ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఫిబ్రవరి 21 నుంచి 28 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సురుపంగా ప్రకాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బోల్లేపల్లి స్వామి, జిల్లా కోశాధికారి కొత్త లలిత తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి